దేవుడి విగ్రహాన్ని తాకాడని.. దళిత కుటుంబానికి జరిమానా.. 8 మంది అరెస్టు

Eight held after Dalit family fined Rs 60K for ‘touching’ deity in Karnataka. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో హిందూ దేవుడి విగ్రహాన్ని తాకిన దళిత బాలుడి కుటుంబానికి రూ.60,000 జరిమానా

By అంజి  Published on  23 Sept 2022 10:21 AM IST
దేవుడి విగ్రహాన్ని తాకాడని.. దళిత కుటుంబానికి జరిమానా.. 8 మంది అరెస్టు

కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో హిందూ దేవుడి విగ్రహాన్ని తాకిన దళిత బాలుడి కుటుంబానికి రూ.60,000 జరిమానా విధించిన కేసులో కర్ణాటక పోలీసులు 8 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఊరేగింపు సందర్భంగా బయటకు తీయాల్సిన దేవుడి విగ్రహాన్ని తాకాడని దళిత బాలుడు చేతన్‌ను నిందితులు కొట్టారు. అతను దేవుడికి విగ్రహానికి చెందిన ఓ వస్తువును కూడా తీయడానికి ప్రయత్నించాడని స్థానికులు అంటున్నారు. ఉల్లేరహళ్లి గ్రామంలో సెప్టెంబర్ 8న ఈ ఘటన జరిగింది.

ఈ సంఘటన తర్వాత గ్రామంలోని పెద్దలు బాలుడి తల్లికి ఫోన్ చేసి, మీ కొడుకు దేవత విగ్రహాన్ని తాకడంతో రూ. 60,000 జరిమానా విధించామని, ఊరేగింపును మళ్లీ నిర్వహించాలని చెప్పారు. జరిమానా కట్టకుంటే బహిష్కరిస్తామని కూడా బెదిరించారు. ఈ ఘటనను తొలుత అధికారులు లెక్కచేయకపోయినా, ఆ తర్వాత చర్యలకు ఉపక్రమించారు. దేవాలయం తాళం పగులగొట్టి దళిత కుటుంబాలను దర్శనానికి అనుమతించారు. మాలూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవై నంజే గౌడ్ దళిత బాలుడి కుటుంబాన్ని పరామర్శించి భద్రత కల్పించారు.

ఇటీవలే ఆలయ నిర్మాణ పనులు జరిగాయని, ఈ నేపథ్యంలో గ్రామంలో పండుగను ఘనంగా నిర్వహించాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నట్లు స్థానికులు తెలిపారు. జరిమానా చెల్లించే వరకు గ్రామంలోకి రావద్దని గ్రామ నాయకులు దళిత బాలుడి కుటుంబంపై బెదిరింపులకు దిగారు. బాలుడి తల్లికి కూడా అగంతకులు బెదిరింపు కాల్స్ చేశారు. ఈ ఘటనపై పోలీసుల తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story