బిగ్ బ్రేకింగ్: సోనియా గాంధీకి అస్వస్థత
By అంజి Published on 2 Feb 2020 2:51 PM GMTఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురైనట్లు ప్రముఖ వార్త సంస్థ ఏఎన్ఐ తెలిపింది. అనారోగ్యం కారణంగా ఆమె ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. సోనియాగాంధీకి ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే పార్టీకి చెందిన కొందరు నేతల సమాచారం ప్రకారం.. ఆమె సాధారణ హెల్త్ చెకప్ వెళ్లారని చెబుతున్నారు. కాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల నుంచి ఇంకా ఎటువంటి సమచారం అందలేదు. సోనియా గాంధీని రాత్రి 7 గంటల సమయంలో ఆస్పత్రిలో చేర్పించారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి గతంలో ఆమె ఉదర సంబంధిత వ్యాధితో బాధపడింది. సోనియా ఆస్పత్రిలో జాయిన్ అయిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు.. ఆస్పత్రికి క్యూ కట్టారు. ప్రస్తుతం ఆమె వెంట తనయుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీలు ఉన్నారు.
Next Story