ఫోన్ మాట్లాడుతూ.. పాము మీద కూర్చున్న మహిళ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sep 2019 8:28 AM GMT
ఫోన్ మాట్లాడుతూ.. పాము మీద కూర్చున్న మహిళ..!

ఫోన్ పిచ్చిలో పడి ఎవరు ఏమి చేస్తున్నారో కూడా తెలీదు. ఫోనులో మాట్లాడుతూ ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలీదు కొందరికి..! అలా కొందరు కొన్ని కొన్ని సార్లు ఫోన్ లో మాట్లాడుతూ అపాయంలో పడుతూ ఉంటారు. అలాంటిదే ఓ మహిళ విషయంలో చోటుచేసుకుంది.

ఫోన్ మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. ఓ పాము మీద కూర్చుంది ఆ మహిళ. ఇంతలో ఆ పాము కాటేసింది. పాము కాటుకు గురైన ఆ మహిళను ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా అప్పటికే మరణించిందని వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన గోరఖ్ పూర్ లోని రియానవ్ గ్రామంలో చోటుచేసుకుంది. జై సింగ్ యాదవ్ అనే వ్యక్తి థాయ్ ల్యాండ్ లో పనిచేస్తున్నాడు. ఆయన తన భార్య గీతకు కాల్ చేశాడు. ఇంతలో ఆమె బెడ్ రూమ్ లోకి రెండు పాములు ప్రవేశించాయి. ఆ విషయం తెలియని గీత గదిలోకి వచ్చి తన బెడ్ మీద కూర్చుంది. కొద్ది క్షణాల్లోనే ఆమెను పాములు కాటేశాయి. ఆ తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.

ఇంతలో కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా.. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. ఆసుపత్రి నుండి వారు ఇంటికి తిరిగి వచ్చినా కూడా ఆ రెండు పాములు ఆ గదిలోనే ఉన్నాయి. దీంతో కోపోద్రిక్తులైన బంధువులు ఆ రెండు పాములను కొట్టి చంపేశారు.

Next Story