చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పీలేరు కలకడ రహదారిపై ఓ కారును ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. మృతులంతా కడప జిల్లా రాయచోటికి చెందిన రషీద్, నజీబ్జాన్, హారూన్, ఖదీరున్నీసాలుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.