రూ.250 నాణేన్ని విడుదల చేసిన ఆర్బీఐ..కేవలం వారికోసమే

By రాణి  Published on  12 March 2020 10:41 AM GMT
రూ.250 నాణేన్ని విడుదల చేసిన ఆర్బీఐ..కేవలం వారికోసమే

వెండితో తయారు చేసిన రూ.250 నాణేన్ని ఆర్బీఐ విడుదల చేసింది. రాజ్యసభ 250వ సమావేశాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నాణేన్ని ముద్రించినట్లు ఆర్బీఐ పేర్కొంది. అయితే..ఇది భారత పౌరులందరికీ అందుబాటులోకి తీసుకురావట్లేదట. కేవలం రాజ్యసభ సభ 250వ సమావేశాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభ సభ్యులకు మాత్రమే పంపిణీ చేసేందుకు ముద్రించినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు.

Also Read : ఇంత ఆల్కహాల్ నేనెప్పుడూ తీసుకోలేదు : కాజల్

ప్రత్యేకంగా ముద్రించిన ఈ నాణెం ముందు భాగంలో సారనాథ్ సింహాల చిత్రం, కాయిన్ విలువను ముద్రించగా.. వెనుకవైపు రాజ్యసభ 250 సెషన్, గాంధీ బొమ్మను, 250 చుక్కలను ముద్రించారు. ఈ నాణేన్ని ప్రజా వినియోగానికి ఉపయోగించరాదని ఆర్బీఐ అధికారులు తెలిపారు. గురువారం రాజ్యసభ సమావేశాలు ముగిశాక సభ్యులకు ఈ నాణేలను పంపిణీ చేయనున్నారు.

Also Read : లక్షల్లో లాటరీ గెలిచాడు.. కానీ ఏం లాభం!

Next Story