ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఇంకో 24గంట‌ల్లో..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 March 2020 9:24 AM GMT
ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఇంకో 24గంట‌ల్లో..

ఎంతో కాలంగా త‌మ హీరో సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానుల‌కు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ శుభ‌వార్త చెప్పనున్నాడు. అజ్ఞాత‌వాసి సినిమా త‌ర్వాత‌ వెండితెరపై క‌న‌ప‌డ‌ని ప‌వ‌న్‌.. హిందీలో సూప‌ర్ హిట్టైన 'పింక్' సినిమా రీమేక్‌లో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా విశేషాల‌కై ప‌వ‌న్ అభిమానులు ఎప్పుడు.. ఎటువంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుందోన‌ని వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

ఇక‌.. ఈ సినిమాను కుటుంబ క‌థా చిత్రాల నిర్మాత‌ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు ఆస్థాన‌ దర్శకుడు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌కుడ‌వడం విశేషం. కొద్దిరోజుల క్రితమే షూటింగ్ ప్రారంభ‌యిన ఈ సినిమా.. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు మ‌నుగ‌డ‌లో ఉన్న వ‌ర్కింగ్ టైటిల్ 'వకీల్ సాబ్'ను టైటిల్ ఫిక్స్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ఇదిలావుంటే.. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సోమవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర‌బృందం ట్విట‌ర్ ద్వారా ప్రకటించింది. ఇక ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టైటిల్‌ ఏంటో తెలుసుకోవడానికి అటు​ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్‌ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. బోని కపూర్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు. స‌మ్మ‌ర్‌లో ఈ సినిమా విడుదల చేయనున్నట్టు స‌మాచారం.



Next Story