బిగ్‌బ్రేకింగ్ : మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలన

By Medi Samrat  Published on  12 Nov 2019 12:11 PM GMT
బిగ్‌బ్రేకింగ్ : మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలన

మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్​ చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకై ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకముందే రాష్ట్రపతి పాలనకు గవర్నర్​ సిఫార్సు చేశారు. కేంద్ర కేబినెట్​ కూడా ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతి కూడా ఆమోదించారు. అయితే.. గవర్నర్​ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ శివసేన... సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది.

ఇదిలావుంటే.. మ‌హ‌రాష్ట్ర ఎన్నిక‌ల‌లో ప్ర‌ధాన పార్టీలుగా నిలిచిన‌ బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ గడువులోగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. పార్టీలు క‌నీసం సంకీర్ణ కూటమిని కూడా ఏర్పాటు చేయలేకపోయాయి. ఎన్నికలకు ముందు బీజేపీ-శివసేన దోస్తీ క‌ట్టాయి, కానీ ఫలితాల తర్వాత కుస్తీ బాట ప‌ట్టాయి. అలాగే.. సీఎం కుర్చీపై క‌న్నేసిన‌ శివసేన ప్రయత్నాలకు కాంగ్రెస్‌, ఎన్సీపీ గండికొట్టడంతో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన 19 రోజుల తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు.

Next Story