ఏపీ ఎన్నికల్లో జేడీ కొత్త పార్టీ ఎవరి ఓటును చీల్చనుంది?

వీవీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీ - జై భారత్ నేషనల్ పార్టీని శుక్రవారం ప్రారంభించడం రాజకీయ వర్గాల్లో పెద్దగా ఉత్సుకతను రేకెత్తించలేదు.

By అంజి  Published on  24 Dec 2023 4:42 AM GMT
Jai Bharat National Party, AndhraPradehs, elections, V V Lakshminarayana

ఏపీ ఎన్నికల్లో జేడీ కొత్త పార్టీ ఎవరి ఓటును చీల్చనుంది?

జేడీ లక్ష్మీనారాయణగా ప్రసిద్ధి చెందిన మాజీ ఐపీఎస్‌ అధికారి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీ - జై భారత్ నేషనల్ పార్టీని శుక్రవారం ప్రారంభించడం రాజకీయ వర్గాల్లో పెద్దగా ఉత్సుకతను రేకెత్తించలేదు. తనకు పలు రాజకీయ పార్టీలు ఆహ్వానం పలికాయని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కానీ వాస్తవానికి అతనిని తీసుకునేవారు ఎవరూ లేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరగా జై భారత్ నేషనల్ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. అతని పక్కన పెద్ద నాయకుడు ఎవరూ కనిపించడం లేదు. అయినప్పటికీ, రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి తమ పార్టీ పుట్టిందని, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేనలు పక్కనపెట్టిన ప్రత్యేక హోదాను మళ్లీ ప్రధాన స్రవంతి చర్చకు తీసుకువస్తామని లక్ష్మీనారాయణ అన్నారు.

రెండవది, రాజకీయ పార్టీని ప్రారంభించే సమయం కూడా తప్పు, ఎందుకంటే ఎన్నికలకు కేవలం మూడు నెలల సమయం ఉంది. పార్టీని నడపడానికి, అధికారంలోకి రావడానికి భారీ అంగబలం, డబ్బు బలం అవసరం ఉంటుంది. వర్తమాన రాజకీయాలను ధనబలం, భారీ సన్నద్ధతతో శాసిస్తున్న తరుణంలో, సుపరిపాలన కోసం రాజకీయాలు చేయవచ్చని తన పార్టీ ప్రపంచానికి నిరూపిస్తుందన్న లక్ష్మీనారాయణ వాక్చాతుర్యాన్ని పట్టించుకునే వారు లేరని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

“అన్నింటికీ మించి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం అనే నినాదం లోపభూయిష్టంగా ఉంది, ఎందుకంటే ప్రజలు దానిపై పూర్తిగా ఆశలు వదులుకున్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే ఏ పార్టీని నమ్మరు. " అని ఒక రాజకీయ విశ్లేషకుడు అన్నారు. అయితే, రాజకీయ పరిశీలకులు కొత్త పార్టీని జాగ్రత్తగా చూస్తున్నారు. ఇది స్వల్ప స్థాయిలో ఉన్నప్పటికీ, ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీల అవకాశాలపై జై భారత్ నేషనల్ పార్టీ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. “వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను చీల్చగలిగితే అది టీడీపీకి లేదా జనసేనకు ఉపయోగపడుతుంది. కానీ అది వ్యతిరేక ఓటును చీల్చినట్లయితే, అది వైసీపీకి సహాయం చేస్తుంది. కాబట్టి, గట్టి పోటీ ఎదురైనప్పుడు జేడి ఇరువైపులా విధ్వంసం ఆడవచ్చు” అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Next Story