బీజేపీలోకి విజయశాంతి.. ముహూర్తం ఖ‌రారు..!

Vijayashanti joins BJP!.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గ‌ల‌నుందా..? అంటే అవున‌నే అంటున్నాయి

By సుభాష్  Published on  23 Nov 2020 8:17 AM GMT
బీజేపీలోకి విజయశాంతి.. ముహూర్తం ఖ‌రారు..!

గ్రేట‌ర్ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ త‌గ‌ల‌నుందా..? అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజ‌య‌శాంతి మంగ‌ళ‌వారం బీజీపీ తీర్థం పుచ్చుకోనున్నార‌ట‌. మంగ‌ళ‌వారం ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో ఆమె క‌మ‌ల‌ద‌శంలో అడుగుపెట్ట‌బోతున్నార‌ని తెలుస్తోంది. విజయశాంతి.. భారతీయ జనతా పార్టీలో చేరడం ఇప్పటికే ఖరారైనట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే విజయశాంతి.. బీజేపీ కండువా కప్పుకుంటారని తెలిపారు. అయితే, ఎప్పుడు చేరేది మాత్రం క్లారిటీగా చెప్పలేదు.

మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు విజయశాంతి. ఈ టూర్‌లో బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలుస్తారని ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి.. ఆయన సక్షమంలోనే పార్టీ కండువా కప్పుకుంటారని చర్చ సాగుతోంది. కాగా, కొన్నాళ్లుగా ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. టి.పీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆమె ఇటీవ‌ల‌ జరిగిన దుబ్బాక ఎన్నికల ప్రచారంలో గానీ, ప్రస్తుతం జరుగుతోన్న గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో గానీ పాల్గొనలేదు. అయినప్ప‌టికి ఆమె కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతార‌నే కొంద‌రు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు చెబుతూ వ‌చ్చారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్‌ కూడా విజ‌య‌శాంతిని క‌లిసి చర్చలు జరిపారు. బీజేపీలో చేరేలా ఆమెను ఒప్పించినట్టు.. ఈ ఢిల్లీ పర్యటనలోనే విజయశాంతి.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే చర్చ మాత్రం విస్తృతంగా సాగుతోంది. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల సమ‌యంలో రాములమ్మ పార్టీలో చేరితే పార్టీ శ్రేణుల్లో మ‌రింత ఉత్సాహాం రానుండం ఖాయం అని అంటున్నారు.

Next Story