రాష్ట్రం మొత్తం బీహారీల చేతిలో బంధి చేశారు : రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy fires on CM KCR.సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ విధానాల‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2022 9:11 AM GMT
రాష్ట్రం మొత్తం బీహారీల చేతిలో బంధి చేశారు : రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ విధానాల‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. వంద‌లాది మంది ఆత్మ‌బ‌లిదానాల‌తో తెలంగాణ సాధించుకున్నామ‌ని.. అయితే ఈ ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణ పౌరుల‌కు ప‌రిపాల‌న‌లో అవ‌కాశాలు ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న సోమేష్ కుమార్, అంజనీ కుమార్, అరవింద్ కుమార్, సందీప్ కుమార్‌లది బిహారేనని ఆయన అన్నారు. వారి వద్ద ఐదారు శాఖలు ఉన్నాయన్నారు. కేసీఆర్‌ది కూడా బిహారేనని.. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తమ పూర్వీకులు బిహారీలని ఆయనే స్వయంగా వెల్లడించారని రేవంత్ చెప్పారు. కేసీఆర్‌.. బీహార్ ఐఏఎస్ లను ఒక రక్షణ వలయంగా ఏర్పాటు చేసుకొని పరిపాలన చేస్తున్నాడ‌ని రేవంత్ రెడ్డి అన్నారు.

20 ఏళ్ళ కోసం ప్లాట్లు చేసి.. అమ్మితే వివరాలు ధరణి లో లేవు. 20 ఏళ్ళ త‌రువాత‌ కూడా ధరణిలో పాత యజమాని పేరు రావడంతోనే హత్యలు జరుగుతున్నాయన్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ కారణంగానే నిన్న హ‌త్య‌లు జ‌రిగాయ‌న్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని హైదరాబాద్ చుట్టుపక్కల భూముల అక్రమాలు జరుగుతున్నాయ‌ని చెప్పారు. బీహార్ ఐఏఎస్ ముటా కారణంగా తెలంగాణ సమాజం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సీఎం కేసీఆర్ ను అడుగుతున్న.. మీ పూర్వికులు బీహార్ కావొచ్చు.. పరిపాలన మొత్తం బీహార్ బ్యాచ్ కేనా.. 152 మంది ఐఏఎస్ లలో కేవలం బీహార్ ఐఏఎస్ లే ప్రతిభావంతులా.. సీఎస్ సోమేశ్ కుమార్.. ఐఏఎస్ సర్వీస్ లో ఏడేళ్లు పని చేయలేదన్నారు.

సోమేశ్ కుమార్ సీనియారిటీ ప్రకారం.. ప్రిన్సిపల్ సెక్రటరీ కే పరిమితం. కానీ సీఎస్ గా బాధ్యతలు ఇచ్చారు. విభజన సందర్భంగా ఏపీ క్యాడర్ కు సోమేశ్ కుమార్ ను కేటాయించారు. డీవోపీటీలో కేసు ఉంటే బెంచ్ మీదకు రాకుండా మేనేజ్ చేస్తున్నారు. ఐదేళ్లు పూర్తవుతున్న కేసు బెంచ్ మీదకు రావడం లేదు. జయేష్ రంజన్ , అరంవింద్ కుమార్ , సందీప్ కుమార్ సుల్తానియా , రజత్ కుమార్ వీరందరూ బీహార్ కు చెందిన ఐఏఎస్ లు ఒక ముఠాగా ఏర్పడ్డారు.

గ్రేటర్ ఎన్నికల్లో 30 లక్షల ఓట్లను సోమేశ్ కుమార్ తొలగించారు. నజరానా గా సీఎస్ పోస్ట్ ఇచ్చారు. రజత్ కుమార్ జనరల్ ఎన్నికల్లో అవకతవకలకు సహకరించినందుకు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చారు. అరవింద్ కుమార్ చేస్తున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. ఈయనకు ఆరు శాఖలు ఇచ్చారు. ఐపీఎస్ అంజనీ కుమార్ కూడా బీహార్ బ్యాచ్. డీజీపీ మహేందర్ రెడ్డి ని ఉన్న ఫలంగా పంపించి.. బీహార్ బ్యాచ్ అంజనీ కుమార్ ను తీసుకొచ్చారు.

రాష్ట్రం మొత్తం బీహారీల చేతిలో బంధి చేశారు. పరిపాలనలో బీహారీల తప్పుడు విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ కూడా బీహార్ బ్యాచ్.. బీహార్ ఐఏఎస్ లపై నిఘా పెట్టాలి..నేను ఇవన్నీ బయట పెడితే.. రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సింది పోయి.. బీహార్ మంత్రి నన్ను విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాట్లాడాలి. చైతన్య వంతమైన తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. బీజేపీ నేతలు బండి సంజయ్ , కిషన్ రెడ్డి లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ముందు ఏపీ క్యాడర్ అధికారులను పంపించే చర్యలు తీసుకోవాలి. కేంద్రం పరిధిలోని అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేసులను ఎందుకు వాధించడం లేదు. తెలంగాణ సమాజం వీటన్నింటినీ గుర్తించాలని రేవంత్ అన్నారు.

Next Story