ప్రియాంక పోటీ చేసి ఉంటే మోదీ ఓడిపోయేవారు: రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాందీ సంచలన కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  11 Jun 2024 4:00 PM GMT
rahul gandhi, congress, priyanka gandhi,  modi, ayodhya,

ప్రియాంక పోటీ చేసి ఉంటే మోదీ ఓడిపోయేవారు: రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాందీ సంచలన కామెంట్స్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి తన సోదరి ప్రియాంక గాంధీపోటీ చేసి ఉంటే ప్రధాని మోదీ ఆమె చేతిలో ఘోరంగా ఓడిపోయేవారని ఆయన అన్నారు. వారణాసిలో కాంగ్రెస్‌ నేత అజయ్‌ రాయ్‌పై ప్రదాని మోదీ 1.52 లక్షల మెజార్టీతో గెలిచారని అన్నారు. ప్రియాంక పోటీ చేసి ఉంటే మోదీ రెండు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో ఓడేవారని రాహుల్‌గాంధీ జోస్యం చెప్పారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాయ్‌ బరేలిలో కాంగ్రెస్‌ నేతలతో సమావేశం అయిన రాహుల్ గాంధీ ఈ కామెంట్స్ చేశారు. పార్లమెంట్‌లో బీజేపీ బలాన్ని తగ్గించేందుకు రాయ్‌బరేలీ, అమేథీలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇండియా కూటమి పార్టీలు ఐకమత్యంతో పోరాడాయని రాహుల్‌ చెప్పారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమంలో సామాన్యులను మరిచి... పారిశ్రామికవేత్తలు, ప్రముఖులకే ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. ప్రజలు బీజేపీకి సరైన గుణపాఠం చెప్పారని అన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. అమేథి, రాయ్‌బరేలీలలో కాంగ్రెస్‌ పార్టీకి చారిత్రాత్మక విజయం అందించారని అన్నారు. దేశమంతా ఇప్పుడు అయోధ్య వైపు చూస్తోందని అన్నారు. స్వచ్ఛమైన, అంకితభావంతో కూడిన రాజకీయాలు అవసరమనే సందేశం అయోధ్య ప్రాంతమని అన్నారు .

Next Story