టీడీపీ - జనసేన పొత్తు లేదా?
చంద్రబాబు నాయుడు అరెస్ట్కు వ్యతిరేకంగా చేపట్టిన అన్ని ఆందోళనలకు మద్దతిచ్చిన పవన్.. టీడీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో లేరని తెలుస్తోంది.
By అంజి Published on 5 Oct 2023 12:31 PM IST
టీడీపీ - జనసేన పొత్తు లేదా?
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు ఉంటుందని జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్కు వ్యతిరేకంగా చేపట్టిన అన్ని ఆందోళనలకు ఆయన పూర్తి మద్దతునిస్తూ వస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటంలో ఇరు పార్టీలు పరస్పరం సహకరించుకోవడం ప్రారంభించాయి. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో టీడీపీ శ్రేణులు పాల్గొనగా, నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు జనసేన పార్టీ కార్యకర్తలు మద్దతు తెలిపారు. ఇంతవరకు అంతా బాగనే ఉంది. అయితే తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో పవన్ కళ్యాణ్ లేరని తెలుస్తోంది.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణ యూనిట్ మంచి సంఖ్యలో నియోజకవర్గాలపై ఆసక్తి చూపుతున్న తరుణంలో జనసేన పార్టీ స్వతంత్ర మార్గాన్ని ఎంచుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన పార్టీ అభ్యర్థుల జాబితాను సోమవారం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మొత్తంగా, జనసేన పార్టీ 32 అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టనుంది.
కూకట్పల్లి, ఎల్బీనగర్, నాగర్కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, సనత్నగర్, ఉప్పల్, కొత్తగూడెం, అశ్వరావుపేట, పాలకుర్తి, నరసంపేట్, స్టేషన్ ఘన్పూర్, హుస్నాబాద్, జగిత్యాల, నకిరేకల్, సత్తునగర్, హుజూర్కల్, హుజూర్పల్లి, పశ్చిమ), వరంగల్ (తూర్పు), మల్కాజిగిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, యెల్లందు, మధిర నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్టు జనసేన ప్రకటించింది.
వీటిలో కొన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ టీడీపీ కూడా పోటీకి ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా ఐటీ ప్రాబల్యం ఉన్న కూకట్పల్లి, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, ఖమ్మం, కోదాడ, సత్తుపల్లి తదితర కమ్మ ప్రాబల్య ప్రాంతాల్లో పోటీ చేయాలనుకుంటోంది. కమ్మ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో టీడీపీకి ఇంకా కొంత ఓటు బ్యాంకు ఉందని, సీట్లు గెలవకపోతే కొంత ఓట్లు రాబట్టుకోవాలని భావిస్తోంది. రెండు పార్టీలు ఆంధ్రాలో పొత్తు పెట్టుకుంటున్నాయి కాబట్టి.. తెలంగాణలో కూడా పొత్తు గురించి ఆలోచించి ఉండాల్సిందని, తద్వారా ఇక్కడ కనీసం రెండు, మూడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.