కేసీఆర్‌ రెండు చోట్ల పోటీ వెనక వ్యూహం అదేనా!

భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌.. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

By అంజి  Published on  22 Aug 2023 6:02 AM GMT
BRS, CM KCR, Telangana elections, Gajvel, Kamareddy District

కేసీఆర్‌ రెండు చోట్ల పోటీ వెనక వ్యూహం అదేనా!

భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నుండి, అలాగే కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గం పోటీ చేయాలని నిర్ణయించుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. సీఎం కేసీఆర్ జాబితా ప్రకటించే వరకు ఆయన రెండు స్థానాల్లో పోటీ చేస్తారనే విషయం ఆయన సొంత బీఆర్‌ఎస్‌ నేతలతో సహా ఎవరికీ తెలియదు. అయితే మొదట్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి కామారెడ్డి లేదా పెద్దపల్లికి మారతారనే టాక్ కూడా ఉంది. కానీ ఆయన గజ్వేల్ నియోజకవర్గం నుండి కూడా బరిలో ఉంటారని ఎవరూ ఊహించలేదు.

ఒకానొక దశలో కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని, ఈ ఎన్నికలను ఆయన తనయుడు కేటీఆర్‌కే వదిలేస్తారనే చర్చ కూడా సాగింది. అతను దేశ రాజకీయాలను ఎంచుకున్నందున, అతను నేరుగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని అంతా అనుకున్నారు. కానీ అది జరగకపోవడంతో కేసీఆర్ కేవలం గజ్వేల్‌లో కాకుండా రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్‌ని దగ్గరి నుంచి తెలిసిన వారికి, రాజకీయాలలో ఆయన చాకచక్యాన్ని చూసే వారికి సైతం ఇది అంతుచిక్కని అంశంగా ఉంది. గజ్వేల్‌లో సొంత సీటు గెలుస్తామన్న నమ్మకం లేదని కేసీఆర్‌ రెండు స్థానాల్లో పోటీ చేయడం వల్లే అర్థమవుతోందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. అందుకే కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకుని జూదం ఆడుతున్నారని అన్నారు.

గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, దానికి ఆనుకుని ఉన్న మెదక్ జిల్లాలో బీఆర్‌ఎస్‌తో అంతా బాగాలేదని కేసీఆర్‌కు ఇంటెలిజెన్స్ నివేదికలు అందినట్లు తెలుస్తోంది. తన కుమార్తె కల్వకుంట్ల కవితను కామారెడ్డి లేదా నిజామాబాద్‌ నుంచి పోటీకి దింపాలని ఆయన మొదట భావించారు. కానీ, ఆ సీటు ఏదైనప్పటికీ ఓడిపోతే అది పార్టీకి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. అందుకే కేసీఆర్ స్వయంగా రిస్క్ తీసుకోవాలని భావించి కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా అన్ని సమీప నియోజకవర్గాలలో పార్టీ అవకాశాలను పెంచుతుంది, బీఆర్‌ఎస్‌కు పెద్ద ఎత్తున విజయాన్ని అందిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 'కామారెడ్డి, గజ్వేల్ నుండి ఎన్నికైన తర్వాత, కేసీఆర్‌ ఎదో ఒక దానికే పరిమితం అవుతారు. బహుశా గజ్వేల్‌కే పరిమితం కావచ్చు. ఆ తర్వాత, కామారెడ్డిలోని ఫీల్డ్‌ను తన కుమార్తెకు తర్వాతి వదిలివేయవచ్చు. అదే వ్యూహంగా కనిపిస్తోంది' అని పార్టీ వర్గాలు తెలిపాయి.

Next Story