ఇప్పుడు నమ్మకం ఏర్పడింది: నిర్భయ తల్లి

By సుభాష్  Published on  17 Feb 2020 11:34 AM GMT
ఇప్పుడు నమ్మకం ఏర్పడింది: నిర్భయ తల్లి

నిర్భయ దోషులపై ఢిల్లీ పటియాల కోర్టు మరోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఇప్పటి వరకు రెండు సార్లు ఉరిశిక్ష అమలు చేసినా.. దోషుల క్షమాభిక్ష పిటిషన్ల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా కోర్టు మరోసారి తీర్పునిచ్చింది. మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటలకు నలుగురి దోషులను ఉరి తీయాలంటూ సంచలన తీర్పునిచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది.

ఈ సందర్భంగా నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ.. కూతురుపై జరిగిన దారుణంపై ఏడేళ్లుగా పోరాడుతున్నానని, తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికి కోర్టుపై నమ్మకం ఏర్పడిందని, తనకు ఇప్పడైన సరైన న్యాయం జరుగుతుందనే భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు రెండు సార్లు కోర్టు నలుగురు దోషులపై డెత్‌ వారెంట్లు జారీ చేసినా.. తర్వాత వాయిదా పడుతూ వచ్చిందని, ఏదేమైనా కోర్టు తీర్పు వల్ల న్యాయం జరుగుతుందనే నమ్మకం ఏర్పడిందని పేర్కొన్నారు.

Next Story