నిర్భయ కేసులో సంచలన ట్విస్ట్‌.. ఇప్పుడు దోషులు ఏకంగా..

By సుభాష్
Published on : 16 March 2020 5:16 PM IST

నిర్భయ కేసులో సంచలన ట్విస్ట్‌.. ఇప్పుడు దోషులు ఏకంగా..

2012 డిసెంబర్ 16న ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో మరో కొత్త మలుపు తిరిగింది. దోషులకు ఇప్పటికే మూడు సార్లు ఉరిశిక్ష ఖరారు కాగా, దోషులు పెట్టుకున్న వివిధ రకాల పిటిషన్ల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఢిల్లీ పటియాల కోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ నెల 20న నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించనున్నారు జైలు అధికారులు.

ఈ కేసులో దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దోషుల్లో ఒకరు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రోజు కోర్టు కొట్టివేసింది. ఇక ఆఖరి సారిగా దోషులు తమవంతుగా మరో ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ముగురు దోషులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉరిశిక్షపై స్టే విధించాలని కోరుతూ ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దోషులు అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా తరపున లాయర్‌ ఏపీ సింగ్‌ అంతర్జాతీయ న్యాయస్థానానికి ( ఐసీజే)కి లేఖ రాశారు. దోషులు శిక్ష నుంచి బయటపడేందుకు ఇన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నా.. చివరికి ఉరిశిక్ష పడుతుందా..? లేదా అనేది స్పష్టత రావడం లేదు. కాగా, వీరి పిటిషన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

కాగా, 2012, డిసెంబర్‌ 16న ఓ విద్యార్థిపై కదులుతున్నబస్సులో ఆరుగురు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితులైన, వినయ్‌, రామ్‌ సింగ్‌, అక్షయ్‌కుమార్‌, పవన్‌, ముఖేష్‌, మరో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని తీహార్‌ జైలుకు తరలించగా, 2013లో ఓ నిందితుడు జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో నిందితుడు మైనర్‌గా భావించి మూడు సంతవ్సరాల పాటు జైలు శిక్ష విధించి విడుదల చేశారు. కేసు విచారించిన కోర్టు, కాగా మిగిలిన నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించింది.

Next Story