వీళ్లను ఇలా ఉరి తీయడం దేశంలోనే మొదటిసారి

By సుభాష్  Published on  1 Jan 2020 2:08 PM GMT
వీళ్లను ఇలా ఉరి తీయడం దేశంలోనే మొదటిసారి

ముఖ్యాంశాలు

  • ఒకేసారి నలుగురిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు

  • నలుగురు దోషులు మూడు గంటలపాటు ఉరి కంబానికి

  • ఏర్పాట్లు చేస్తున్న జైలు అధికారులు

2012, డిసెంబర్ 15న దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషుల శిక్షలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు దోషులను ఒకేసారి ఊరితీయనున్నట్లు తెలుస్తోంది. వీరి ఉరి తీతకు తీహార్‌ జైలులో ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు ఉరికంబాలు, నాలుగు సొరంగాలను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్భయ దోషులైన అక్షయ్‌ కుమార్‌, పవన్‌, ముఖేష్‌, వినయ్‌లకు ఒకేసారి ఉరిశిక్ష అమలు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ నెల 7వ తేదీన నలుగురు దోషుల డెత్‌ వారెంట్‌లపై ఢిల్లీ పటియాల హౌస్‌ కోర్టు తీర్పు వెల్లడించనుండగా, తీర్పు వెలువడిన వెంటనే వారికి ఉరిశిక్ష అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాగా, 1982లో మైనర్లు సంజయ్‌ చోప్రా, గీతా కిడ్నాప్‌ కేసులో దోషులైన బిల్లా, రంగాలను ఒకేసారి ఉరితీశారు. ఇప్పుడు నిర్భయ కేసులో నలుగురిని ఒకేసారి ఉరి తీస్తుండటం దేశ చరిత్రలోనే మొదటి సారి అని చెప్పాలి.

మూడు గంటల పాటు ఉరి కంబానికి..

నలుగురి బరువును మూడు గంటల పాటు ఉరి కంబాలు మోయగలవా? లేవా? అన్ని నిర్దారించటం కోసం తీహార్ జైలు అధికారులు రెండు సార్లు ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. మెడకు ఉరితాళ్లు గట్టిగా బిగుసుకుపోకుండా ఉండేలా.. దానికి వెన్న రాయనున్నారు. దీంతో తక్కువ నొప్పితో దోషులు మరణించే అవకాశం ఉంటుందని జైలు అధికారులు చెబుతున్నారు.

తీహార్‌ జైల్లో 1950లో ఉరి ప్రాంగణం

ప్రస్తుతం నలుగురు దోషులు తీహార్‌ జైల్లో ఉన్నారు. ఈ జైల్లో ఉరి తీసే ప్రాంగణాన్ని1950లో నిర్మించారు. రెండు స్తంభాలను కలుపుతూ మెటల్ బార్ ను ఏర్పాటు చేశారు. దీనికి ఉరితాడును కట్టనున్నారు. ఆ తాళ్ల వల్ల మెడ కోసుకుపోకుండా.. గాయాలు కాకుండా చూడాల్సి ఉంటుందని జైలు అధికారులు చెబుతున్న మాట. దోషులను ఉరి తీసే సమయం దగ్గర పడుతుండటంతో ఉరికి సంబంధించిన ఏర్పాట్లలో జైలు అధికారులు బిజీ బిజీగా ఉన్నారు

ఉరితాళ్లను తయారు చేస్తున్న బక్సర్‌ జైలు ఖైదీలు :

సుప్రీం కోర్టు ఆదేశంతో 10 ఉరి తాళ్లు సిద్ధమవుతున్నాయి. బీహార్‌లోని బక్సర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్ ఖైదీలో ఈ ఉరితాళ్లను తయారు చేస్తున్నట్లు ఆ జైలు అధికారులు ఇటీవల వెల్లడించారు. అప్జల్‌ గురు ఉరి తీసిన తాడును కూడా ఈ జైలు ఖైదీలో తయారు చేశారు. ఉరి తాళ్లను తయారు చేసే వాటిలో ఈ బక్సర్‌ జైలు ప్రసిద్ధి. ఈ ఉరితాళ్లను తయారు చేసేందుకు ప్రత్యేక తాళ్లను వాడుతుంటారు.

Next Story