వరంగల్ పేపర్ లీక్ : బీజేపీ నేతలు కుట్ర పన్నారా?

Warangal Paper Leak BJP Leaders hatch Conspiracy. ప్రస్తుతం ఉన్న పరీక్షా విధానం పట్ల నాకంటూ మంచి అభిప్రాయమైతే లేదు. ఎందుకంటే ఈ పరీక్షలన్నీ జ్ఞాపకశక్తి మీద ఆధారపడి ఉంటాయి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 April 2023 10:44 AM GMT
వరంగల్ పేపర్ లీక్ : బీజేపీ నేతలు కుట్ర పన్నారా?

ప్రస్తుతం ఉన్న పరీక్షా విధానం పట్ల నాకంటూ మంచి అభిప్రాయమైతే లేదు. ఎందుకంటే ఈ పరీక్షలన్నీ జ్ఞాపకశక్తి మీద ఆధారపడి ఉంటాయి. పుస్తకాల్లోని అంశాలను గుర్తు పెట్టుకుని వాటిని పరీక్షల్లో రాసే విధానాన్ని ప్రస్తుతం అమలు చేస్తూ ఉన్నారు. 99.9 శాతం మందికి మార్కులు కేవలం వారి జ్ఞాపక శక్తి ఆధారంగా మాత్రమే వస్తూ ఉన్నాయి. అదే విద్యార్థులకు విశ్లేషణాత్మకమైన, ఉన్నత స్థాయి ఆలోచనా నైపుణ్యాలపై ఆధారపడిన ప్రశ్నలు వచ్చినప్పుడు విఫలం అవుతారు. ఫలితంగా వారు నిరాశకు గురవుతారు. ఆ తర్వాత తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. కలలు కనే ఉద్యోగాలకు తాము సరిపోలేమని కూడా వారు భావిస్తారు. కాబట్టి ఇలాంటి పరీక్షా విధానం నాకు నచ్చదు. విద్యారంగంలో విచ్చలవిడిగా సాగుతున్న వ్యాపారీకరణను ఎత్తిచూపుతూ.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా... మానవ అస్తిత్వానికి మనస్సును పెంపొందించుకోవడమే అంతిమ లక్ష్యం అన్న మాటలను గుర్తుకు వస్తాయి.

10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారానికి సంబంధించి, నేను దానిని లీక్ అని పిలవను. లీక్ అనేది మూలం వద్ద జరిగేది. పదో తరగతి పేపర్లు సోర్స్ నుండి లీక్ అయ్యాయని నేను అనుకోను. TSPSC పేపర్ల లీక్ వ్యవహారం మాత్రం అవి మూలం వద్ద లీక్ అయ్యాయి. పదో తరగతి పేపర్‌ పరీక్షా కేంద్రాల వద్ద బయటకు వచ్చింది. మనమందరం పిలిచే విధంగా ఇది లీక్ కాదు.

దీనికి విద్యా శాఖ ప్రాథమిక బాధ్యత వహించాలి. అది మంత్రి కావచ్చు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు లేదా పాఠశాల విద్యాశాఖ కమీషనర్ అవ్వొచ్చు. ఎగ్జామ్స్ కమిషనర్‌కు మాత్రమే తెలిసిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రశ్నపత్రాలను ముద్రించి, ఆపై వాటిని చాలా భద్రతతో ఉన్న ప్రదేశాలలో ఉంచుతారు, పోలీసు పర్యవేక్షణలో వివిధ కేంద్రాలకు రవాణా చేస్తారు. పోలీసు స్టేషన్‌లలో తాళం వేసి భద్రపరచాల్సిన ప్రశ్నపత్రాల నిల్వ, రవాణాకు స్థానిక పోలీసులు బాధ్యత వహించాలి. కీ పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ దగ్గర ఉండాలి.

తరువాత వాటిని పోలీస్ స్టేషన్ నుండి పరీక్షా కేంద్రానికి తీసుకువస్తారు. ఆపై ఇన్విజిలేటర్లు, పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్ సమక్షంలో తీస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది, అప్పటి వరకు ప్రశ్నపత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా ప్రింట్ తీసుకున్నారా వంటి విషయాలు పోలీసులకు లేదా చీఫ్ ఎగ్జామినర్‌కు కూడా తెలియదు. ఇక ప్రశ్న పత్రాలను ఇన్విజిలేటర్లు విద్యార్థులకు పరీక్షా హాళ్లలో పంపిణీ చేస్తారు. ఎగ్జామినర్లు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు ఏ విద్యార్థిని కూడా మొబైల్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు తీసుకెళ్లడానికి అనుమతించరు.. వివాహితులకు కొన్నిసార్లు మంగళ సూత్రాలు, చెవిపోగులు వంటి వాటిని కూడా అనుమతించరు. అయితే ఈ సందర్భంలో, ఒక వ్యక్తి పరీక్షా కేంద్రంలోకి ఎలా ప్రవేశించగలిగాడనేది నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ప్రతి పరీక్షా కేంద్రానికి పోలీసులు లేదా కనీసం వాచ్‌మెన్‌ అయినా కాపలాగా ఉంటారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు కాపలాగా ఉండడం ఆచరణాత్మకంగా సాధ్యం కాకపోవచ్చు. అయినప్పటికీ కొందరు ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో పరీక్షా ప్రాంగణంలోకి ప్రవేశించి, పేపర్‌ల ఫోటోగ్రాఫ్‌ను తీసి వాటిని బయట ఎలా సర్క్యులేట్ చేస్తున్నారో తెలిసి.. నేను నిజంగా ఆశ్చర్యపోయాను.

రెండవ విషయం ఏమిటంటే, తాండూరు వంటి కొన్ని ప్రదేశాలలో ఇన్విజిలేటర్లకు కూడా మొబైల్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ సిబ్బంది కావాలనుకుంటే ప్రశ్నపత్రం ఫోటోలను తీసి షేర్ చేయగలరు. తాండూరు ఘటన ఎందుకు జరిగిందో ఖచ్చితంగా తెలియదు కానీ వరంగల్ ఘటనకు సంబంధించిన విచారణ మాత్రం దారుణంగా అందరూ ఉలిక్కిపడేలా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలను పంచుకుంటాను.

వరంగల్ విషయానికొస్తే, ఆ వ్యక్తి ఫోటో తీసి బండి సంజయ్‌తో సహా ఇతర రాజకీయ నాయకులందరికీ, బీజేపీ రాజకీయ నాయకులకు పంపాడు. ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బీఎస్పీకి లేదా టీఆర్‌ఎస్‌ నాయకులకు పంపలేదు, వాటిని కేవలం బీజేపీ రాజకీయ నాయకులకు మాత్రమే పంపారు. ఫోన్లు, కాల్ లాగ్‌లు, వాట్సాప్ మెసేజ్‌లను విశ్లేషించి వరంగల్ పోలీసులు రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేయడం నన్ను బాగా ఆకట్టుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై వార్తాపత్రికల్లో వచ్చిన అన్ని ముఖ్యాంశాలు, ప్రెస్ బ్రీఫింగ్.. మొత్తం విద్యావ్యవస్థను అప్రతిష్టపాలు చేయడానికి, రాజకీయ వైషమ్యాలకు చాలా చక్కని ప్రణాళికగా కనిపిస్తోంది. ఇది తెలంగాణ విద్యార్థులకు ద్రోహం చేయడం కిందకు వస్తుంది.

ఒక పార్లమెంటేరియన్ కూడా అయిన బీజేపీ అధ్యక్షుడి నిజాయితీ లేని చర్యలను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మొత్తం పరీక్షల వ్యవస్థను అప్రతిష్టపాలు చేసేందుకు ఆయన కుట్ర పన్నినట్లు సమాచారం. లీకేజీలు జరుగుతున్నాయనే సెంటిమెంట్‌ను బిల్డప్ చేసేందుకు రాజకీయంగా ఓ కుట్రను పన్నుతూ ఉండడం శోచనీయం. TSPSC పేపర్ లీక్ అంశం ఇప్పటికీ ప్రజల మనస్సుల్లో తాజాగా ఉంది కాబట్టి, BJP బహుశా తమ రాజకీయ ప్రయోజనాల కోసం 10వ తరగతి పేపర్ లీక్ ను ఎక్కువగా ఉపయోగించుకోవాలని భావించి, ఈ కుట్రను పన్నింది.

వారు ఎందుకు చేసారు? ఇది చాలా లోతుగా విచారించాల్సిన విషయం. దీన్ని తార్కిక ముగింపుకు తీసుకెళ్లాలి. బండి సంజయ్ ఒక్కడే ఇలా చేస్తున్నాడా లేక పోలీస్ కమీషనర్ చెప్పిన దాని ప్రకారం వెళ్తున్నారా? అసోషియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ (ఏబీఎం) కోసం ప్రశాంత్ పని చేసేవారని, దానిని అమిత్ షాకు నివేదించారని ఆయన అన్నారు. అమిత్ షా నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా? రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్ర పన్నాలని బీజేపీ ముఖ్య నేతలు బండి సంజయ్‌ను కోరారా? ఇది దర్యాప్తు చేయవలసిన విషయం, వరంగల్ పోలీసులు దర్యాప్తును అంత దూరం తీసుకువెళ్లే ఉద్దేశ్యం ఉందని నాకు ఖచ్చితంగా తెలియదు. ABM కార్యకలాపాలు, కుట్రలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని నేను భావిస్తున్నాను.

విద్యా వ్యవస్థలో సమస్య ఏమిటంటే మంచి ఉత్తీర్ణత రావాలి. పరీక్షలకు ముందు, బోర్డు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పరీక్షల ఇన్విజిలేటర్‌లను పిలిపించి ఎక్కువ స్కోర్లు, ఉత్తీర్ణత శాతాల కోసం ఒత్తిడి చేస్తుంది. విద్యార్థుల మధ్య ఎవరూ ఊహించని పోటీని ప్రేరేపించే పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించాలని సామాజికంగా, కుటుంబపరంగా అపారమైన ఒత్తిడి ఉంది. రెండో విషయం ఏమిటంటే సెల్ఫ్ సెంటర్లు, ప్రాక్టికల్స్‌లో ఎక్కువ సమయం స్కూల్ మేనేజ్‌మెంట్‌తో ముఠాగా ఉంటారు. ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా ఇన్విజిలేటర్లకు ప్రీ-ఎగ్జామినేషన్ పార్టీలు పెడుతున్నారు. ఈ రకమైన క్విడ్ ప్రో కో ఎప్పటి నుండో జరుగుతోంది. దీన్ని ఎవరూ ఎక్కువగా పట్టించుకోరు.

విజేతలను, ఓడిపోయినవారిని సృష్టించే వ్యవస్థగా పరీక్షా విధానం తయారైంది. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ విధానం పట్ల అందరూ సంతోషంగా ఉన్నారు. తమ పిల్లలు ఫెయిల్ కావడం లేదని తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. తమ విద్యార్థులు 90 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేయడం వల్ల వారు మరింత ఎక్కువ అడ్మిషన్లు వస్తాయని పాఠశాల యాజమాన్యం ఎంతో సంతోషంగా ఉంది. చాలా మంది నిజాయితీ లేని లెక్చరర్లు ప్రాక్టికల్ పరీక్షలలో ఉదారంగా మార్కులు ఇచ్చినందుకు పాఠశాల యాజమాన్యం నుండి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. స్పాట్ వాల్యుయేషన్‌ కేంద్రాలలో కూడా ఎన్నో మోసాలు జరుగుతూ ఉంటాయి. ఈ కేంద్రాల పరిధిలో యూనియన్లు ఈ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలను చేజిక్కించుకుంటాయి. కొన్నిసార్లు 100 మార్కులకు అర్హత లేని వ్యక్తులు 100 మార్కులు పొందారు. 100 మార్కులకు అర్హులైన వ్యక్తులు పెద్దగా రాణించిన సందర్భాలు కూడా లేవు. మోడరేషన్, రెగ్యులేషన్ ఆన్-ది-స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లు లేవు కాబట్టి ఒక పద్ధతి ప్రకారం మోసం జరుగుతూనే ఉంది. ఈ మొత్తం వ్యవస్థకు చివరి బాధితుడు విద్యార్థి. వారు అసలైన పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొన్నప్పుడు, ఈ కారణాల వల్ల వారు చతికిలబడతారు. చాలా మంది వ్యక్తులు విజయవంతం కాలేరు, ఉద్యోగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు లేనందున వారు తమ స్వంత మాతృభూమిలో శరణార్థులుగా మిగిలిపోతారు.

ప్రశ్నా పత్రాలను రూపొందించడం దగ్గర నుండి పరీక్షల ఫలితాలు వెల్లడించే వరకూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిపై రాజకీయ నాయకులు గానీ, విద్యాశాఖ మంత్రి గానీ ఎలాంటి పరిష్కారాన్ని చూపెట్టలేకపోతున్నారు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ పనితీరును సమీక్షించిన సందర్భాలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై సమీక్షలు జరిపిన సందర్భం నాకు గుర్తు లేదు. జనార్దన్ రెడ్డి విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు గ్లోబరేనా కుంభకోణం వెలుగులోకి వచ్చిందని, ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రం, జవాబు పత్రాల్లో వాల్యుయేషన్ తప్పులు దొర్లాయని చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. విద్య, ఇక్కడి వ్యవస్థకు సంబంధించి గత 9 ఏళ్లుగా ఎలాంటి సీరియస్‌నెస్‌ చూపలేదు.

సాధ్యమైన అన్ని మార్గాలను ఉపయోగించి వరంగల్ పోలీసులు దర్యాప్తు చేసిన విధానాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. వారు సరైన మూలాలను ఎంచుకొని కుట్ర కోణాన్ని పరిశీలించారు. వారికి అవసరమైన చట్టపరమైన బ్యాకప్ ఉంది. అయితే టీఎస్‌పీఎస్‌సీ లీకేజీ విచారణ విషయంలో ప్రశ్నపత్రం లీకేజీకి మూలం బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించడం. లీకేజీకి మూలం స్వయంగా చైర్మన్ లేదా కమిషన్ సభ్యులే. ఇక్కడ నేరం జరిగిన దృశ్యం బయటకు కనిపించలేదు చైర్మన్ ఎప్పటిలాగే సమావేశాలు నిర్వహిస్తూ విధుల్లోకి వెళ్తున్నాడు. అతను మంత్రులతో మాట్లాడగలడు, మంత్రులు ఈ కేసును టేకప్ చేయగలరు. వారు అతనిని ప్రజల నుండి రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రెస్ బ్రీఫింగ్‌లు అస్సలు లేవు. 10వ తరగతి పరీక్షతో పోల్చితే మరింత ద్రోహపూరితమైన, దుర్మార్గమైన, ఉత్కంఠభరితమైన TSPSCపై ప్రభుత్వం ఎందుకు తన అడుగులకు మడుగులొత్తుతోంది?

10వ పరీక్ష లీకేజీ కాదని, టీఎస్‌పీఎస్‌సీలో పరీక్షా విధానాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమన్నారు. టీఎస్‌పీఎస్‌సీ పూర్తిగా లీకేజీ ఇది 10వ తరగతి పరీక్ష కంటే చాలా ఘోరమైన కుట్ర. ఇక్కడ సిఎంఓ లేదా మరెవరైనా రాజకీయ నాయకుడు కావొచ్చు అసలు కుట్రదారులను కాపాడుతున్నట్లు కనిపిస్తున్నారు. మొత్తం విచారణలో చాలా కుట్రలు ఉన్నాయి. విచారణలో పారదర్శకత కనిపించడం లేదు. నేను వరంగల్, హైదరాబాద్ అనే రెండు పరిశోధనల మధ్య ఉన్న తేడాలను గుర్తించాను. నిందితులను కాపాడేందుకు హైదరాబాద్ విచారణ, కుంభకోణం మూలాల్లోకి వరంగల్ విచారణ చేపడుతున్నారు. నేను ఒక మాజీ పోలీసు అధికారిగా మాత్రం వరంగల్ విచారణను ఎంతగానో అభినందిస్తున్నాను.

తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? విద్యాశాఖ మొత్తంపై ప్రభుత్వం తన సీరియస్‌నెస్‌ను ప్రదర్శించాలి. కేవలం ప్రశ్నాపత్రాల ముద్రణలోనే కాకుండా పూర్తిగా పరీక్షల నిర్వహణ వరకూ కూడా వీలైనంత సీరియస్‌నెస్‌ను ప్రదర్శించాలి. సిట్టింగ్ స్క్వాడ్ షీల్డింగ్ లతో కాపీయింగ్‌ను నిరుత్సాహపరచాలి. సమగ్రత అనేది విద్యార్థుల ప్రధాన విలువలలో ఒకటిగా ఉండాలి. విద్యావ్యవస్థలో చాలా చిన్న వయస్సు నుండి విద్యార్థులకు విలువలను బోధించాలి. గందరగోళానికి పాల్పడే వారిని శిక్షించాలి. లీకేజీకి పాల్పడిన వారిని అరెస్టు చేసేందుకు చట్టం అనుమతించాలి. ఇంటెలిజెన్స్ నిఘా ఉంచాలి, ఎలాంటి రాజకీయ కట్టుబాట్లకు లొంగకుండా ఉండాలి. సందేహాస్పద రికార్డులు ఉన్న వ్యక్తులను వ్యవస్థలోకి అస్సలు అనుమతించకూడదు. ఉదాహరణకు: గత TSPSC బోర్డులో సభ్యుల్లో ఒకరు ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లారు. తరువాత రాజకీయ కారణాల వల్ల ఈ వ్యక్తి TSPSC సభ్యునిగా నియమించబడ్డాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు వ్యవస్థలోకి ప్రవేశిస్తే వారు విద్యార్థి కలలకు ఎలాంటి హాని చేస్తారో ఊహించుకోండి.

పేపర్లు లీక్ చేయడం, ఇతరత్రా పనులు చేసే వ్యక్తులను వ్యవస్థలోకి అనుమతించకూడదు. ప్రభుత్వం తన ఉద్దేశాలను ఖచ్చితంగా స్పష్టం చేయాలి. వారు తమకు తెలిసిన వారు బ్యాక్‌డోర్ ద్వారా పరీక్షలను ఛేదించాలని, వ్యవస్థలోకి ప్రవేశించాలని కోరుకుంటారు. అలా వచ్చిన వాళ్లు వారికి విధేయతతో ఉంటారు. పూర్తి నిజాయితీతో తమ విధులను నిర్వర్తించగల సమర్థుల కోసం రాష్ట్రం వెతకాలి. ఈ రోజు మీ స్వంత వ్యక్తులను కలిగి ఉండటం బాగానే అనిపించినా.. కానీ అలాంటి వ్యక్తులు భవిష్యత్తులో మొత్తం వ్యవస్థను నాశనం చేస్తారు.

తెలంగాణలోని రాజకీయ వ్యవస్థ ప్రజలకు విద్య, ఉపాధిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేసింది. నేడు తెలంగాణ అక్షరాస్యత శాతంలో అట్టడుగున నాలుగు స్థానాల్లో ఉంది. మన రాష్ట్రం కొన్ని BIMARU రాష్ట్రాల కంటే అధ్వాన్నంగా ఉన్నాము. రాజకీయ నాయకులు రాష్ట్రంలో విద్య, పరీక్షలు, ఉద్యోగ పరిస్థితులను చక్కదిద్దకపోతే.. రాజకీయ పార్టీలు తమ సాధారణ పరీక్షలలో - ఎన్నికలలో ఫెయిల్ మార్కులకు సిద్ధం కావాలి.

రచయిత - ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీకి కార్యదర్శిగా పనిచేసిన ఇండియన్ పోలీస్ సర్వీస్ మాజీ అధికారి. ఆగస్టు 2021లో బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు, తెలంగాణలో పార్టీని నడిపిస్తూ ఉన్నాడు.


Next Story