శివసేనకు కాంగ్రెస్ - ఎన్సీపీ మద్దతు ఇవ్వబోతున్నాయా?!!
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 Nov 2019 5:26 PM GMTముంబై: ఉద్దవ్ థాకర్, శరద్ పవార్ ఫోన్లో మాట్లాడుకున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. శివసేన ఎంపీ దగ్గరుండి ఉద్దవ్ తో శరద్ పవార్ను మాట్లాడించినట్లు తెలుస్తోంది. దీంతో శివసేనకు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ - ఎన్సీపీ రెడీ అవుతున్నాయా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.బీజేపీతో ఇప్పటికీ మాటమంతీ లేకపోవడంతో శివసేన కాంగ్రెస్ కూటమికి దగ్గర అవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే.. సిద్ధాంత వైరుధ్యం ఉన్న కాంగ్రెస్ - ఎన్సీపీతో శివసేన కలుస్తుందా అనేది పెద్ద ప్రశ్న. అసెంబ్తీ ఎన్నికల్లో శివసేన 56స్ధానాలు గెలుచుకుంది. ఎన్సీపీ 54సీట్లు, కాంగ్రెస్ 44సీట్లు గెలుచుకున్నాయి. ఈ ముగ్గురు కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కాని..బీజేపీ 105 సీట్లు గెలుచుకుని ఉంది. అతి పెద్ద పార్టీ బీజేపీనే. అయితే..ఏ సమయంలో ఏదైనా జరగొచ్చు. ఇప్పటికైతే..శివసేన దూకుడుగా ఉన్న మాట వాస్తవమే.
Next Story