Video: పేక మేడల్లా కూలిపోయిన ఇళ్లు.. సిమ్లాలో కొండచరియల విధ్వంసం

హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. అక్కడి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది.

By అంజి  Published on  16 Aug 2023 1:30 AM GMT
Houses collapse, landslide, Shimla, Himachalpradesh

Video: పేక మేడల్లా కూలిపోయిన ఇళ్లు.. సిమ్లాలో కొండచరియల విధ్వంసం

హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు అక్కడి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. భారీగా కొండ చరియలు విరిగిపడటంతో ఇళ్లు పేక మేడల్లా కూలిపోయాయి. సిమ్లాలోని కృష్ణ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు కూలిపోయాయి. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. సీఎం సుఖ్వీందర్‌ సింఘ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సెకన్ల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడం, చెట్లు విరిగిపడడం, ఇళ్లు కూలడం వంటి ఘటనల్లో మృతుల సంఖ్య 53కి చేరింది. అధికారుల ప్రకారం.. సిమ్లాలోని సమ్మర్‌హిల్. ఫాగ్లీలో శిథిలాల కింద ఇంకా 10 మంది సమాధి అయ్యారని సమాచారం. గల్లంతైన వారి కోసం కేంద్ర, రాష్ట్ర సహాయక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. తాము ఇళ్లలోని పగుళ్లను గమనించామని స్థానిక కౌన్సిలర్‌ బిట్టు పన్నా తెలిపారు. పగులు వ్యాపిస్తున్నాయని, ఇళ్లను ఖాళీ చేయాలని అందరినీ అభ్యర్థించామని చెప్పారు. అంతలోనే ఆకస్మాత్తుగా అనేక ఇళ్లులు కూలిపోయాయని, దాదాపు 25 ఇళ్లులను ఖాళీ చేయించామని, 50 మందిని కాపాడామని చెప్పారు.

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 16న అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌తో పాటు అన్ని పాఠశాలలు, కళాశాలలు బుధవారం మూతపడతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యార్థుల భద్రత, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నుండి భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ను అతలాకుతలం చేశాయి, కొండచరియలు విరిగిపడటం అనేక రహదారులను నిరోధించాయి. ఇళ్లు కూలిపోయిన సంఘటనలకు దారితీశాయి. సోమవారం, సిమ్లాలో రెండు కొండచరియలు విరిగిపడగా, ఒకటి సమ్మర్ హిల్‌లోని శివాలయం వద్ద, మరొకటి ఫాగ్లీ వద్ద 16 మందిని బలిగొంది.

Next Story