వ్యాక్సినేషన్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న భారత్

Vaccination In India. భారత్ లో కేవలం 99 రోజుల వ్యవధిలో 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ను ఇచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. సరికొత్త రికార్డు

By Medi Samrat  Published on  25 April 2021 10:29 AM GMT
vaccination in India

భారత ప్రభుత్వం కరోనా కేసుల కట్టడికి చాలా చర్యలు చేపడుతోంది. అలాగే వ్యాక్సినేషన్ ను కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. భారత్ లో కేవలం 99 రోజుల వ్యవధిలో 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ను ఇచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. శనివారం రాత్రి వరకూ 14,08,02,794 టీకా డోస్ లను అందించామని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇది సరికొత్త రికార్డు అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

టీకా తీసుకున్న వారిలో 92.89 లక్షల మంది ఆరోగ్య శాఖ సిబ్బందికి తొలి డోస్ ను అందించామని, వీరిలో 59.94 లక్షల మందికి రెండో డోస్ కూడా అందిందని అదికారులు తెలిపారు. 1.19 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలి డోస్ అందిందని, వీరిలో 62.77 లక్షల మందికి రెండో డోస్ ను కూడా ఇచ్చామని వెల్లడించారు.

భారత్ తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆపై రెండో దశ మార్చి 1 నుంచి, మూడవ దశ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. నాలుగో దశలో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలను ఇవ్వనున్నారు. ఇక 45 నుంచి 60 ఏళ్లు పైబడిన వారిలో 4.76 కోట్ల మందికి తొలి డోస్, వారిలో 23.22 లక్షల మందికి రెండో డోస్ అందిందని పేర్కొన్నారు. 60 సంవత్సరాలు దాటిన వారిలో 4.96 కోట్ల మందికి తొలి డోస్ ను, వారిలో 77.02 లక్షల మందికి రెండో డోస్ ను ఇచ్చామని అధికారులు వెల్లడించారు.


Next Story