యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఆరుగురు దుర్మరణం చెందారు.

By Srikanth Gundamalla  Published on  27 Feb 2024 5:19 AM GMT
uttar pradesh, road accident, six people dead,

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ఆరుగురు దుర్మరణం చెందారు. హల్దీ ప్రాంతంలోని సుగర్‌ ఛఫ్రా మలుపు వద్ద ఈ ప్రమాదం సంభవించింది.

బల్లియా జిల్లాలోని సుగర్ ఛప్రా వద్ద పికప్‌ వ్యాన్‌ రెండు కమాండర్‌ జీపులను ఢీకొట్టింది. దాంతో.. మంగళవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఇదే ప్రమాదంలో మరో 8 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. జిల్లా ఆస్పత్రి నుంచి బీహెచ్‌యూకి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. బాధితులు ఖేజురీలోని మసంపూర్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఖేజురీలో వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Next Story