50 రూపాయల విషయంలో గొడవ.. చివరికి ఏమైందంటే?

ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 April 2024 12:30 PM GMT
uttar pradesh, man, shopkeeper, fight,  50 rupees ,

 50 రూపాయల విషయంలో గొడవ.. చివరికి ఏమైందంటే? 

ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక బట్టల దుకాణంలో ఒక వ్యక్తి ఫ్రాక్ కొనుగోలు చేశాడు. అయితే రూ.50 కోసం దుకాణదారుడితో గొడవ పెట్టుకున్నాడు. చివరికి కొనుగోలుదారుడు.. దుకాణదారుడి వేళ్లను కొరికేశాడు. దుకాణదారుడు శివచంద్ర కర్వారియా మాట్లాడుతూ, ఒక కస్టమర్ తన దుకాణానికి ఫ్రాక్ కొనడానికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగిందని అన్నాడు. అతను ఒక ఫ్రాక్ కొని వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి దుకాణానికి తిరిగి వచ్చి, తాను కొనుగోలు చేసిన ఫ్రాక్ చిన్నదని.. పెద్ద సైజు కావాలని కార్వారియాతో చెప్పాడు. పెద్ద ఫ్రాక్ కోసం మరో రూ.50 చెల్లించాలని దుకాణదారుడు డిమాండ్ చేశాడు.

అయితే తాను 50 రూపాయలు ఇవ్వనని చెప్పాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం సమయంలో.. ఆ వ్యక్తి కర్వారియా ఎడమ చేతిని కొరికాడు. కర్వారియా కొడుకును కూడా కొరికి గాయపరిచాడు. ఆ తర్వాత నిందితుడు షాపులోని దుస్తులను రోడ్డుపైకి విసిరేశాడు. అతను అక్కడి నుండి పారిపోయే ముందు దుకాణదారుని కూడా బెదిరించాడు. గాయపడిన కర్వారియా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. దుకాణదారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నరైని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) సురేష్ సైనీ తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నామని.. అరెస్టు చేసిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

Next Story