ఛత్తీస్‌గఢ్‌లో పేలిన ఐఈడీ.. ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో శుక్రవారం నక్సలైట్లు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని పేల్చడంతో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

By అంజి
Published on : 17 Jan 2025 12:41 PM IST

Two BSF jawans, injured, IED blast, Naxalites, Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో పేలిన ఐఈడీ.. ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో శుక్రవారం నక్సలైట్లు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని పేల్చడంతో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గర్పా గ్రామ సమీపంలోని తన శిబిరం నుండి బీఎస్‌ఎఫ్‌ రోడ్ - ఓపెనింగ్ పార్టీ పెట్రోలింగ్‌లో ఉన్నప్పుడు ఉదయం ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. గర్పా గ్రామం మధ్య జరిగినప్పుడు నక్సలైట్లు IED పేల్చడంతో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. నక్సలైట్లు ఐఈడీని పేల్చి ఇద్దరు జవాన్లకు గాయాలైనప్పుడు శిబిరం మరియు గర్పా గ్రామం మధ్య రోడ్డు ఓపెనింగ్ పార్టీ జరిగింది. గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

గురువారం, పొరుగున ఉన్న బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ప్రెషర్‌ ఐఈడీ పేలడంతో సీఆర్‌పీఎఫ్‌ యొక్క ఎలైట్ జంగిల్ వార్‌ఫేర్ యూనిట్ కోబ్రాకు చెందిన ఇద్దరు కమాండోలు గాయపడ్డారు. జనవరి 12 న, సుక్మా జిల్లాలో 10 ఏళ్ల బాలిక, బీజాపూర్ జిల్లాలో ఇద్దరు పోలీసులు ఇదే విధమైన ప్రెషర్‌ ఐఈడీ పేలుళ్లలో గాయపడ్డారు. రెండు రోజుల క్రితం, నారాయణపూర్ జిల్లాలోని ఓర్చా ప్రాంతంలో రెండు వేర్వేరు సంఘటనలలో ఒక గ్రామస్థుడు మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. జనవరి 6న బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు ఐఈడీతో కూడిన వాహనాన్ని పేల్చివేయడంతో ఎనిమిది మంది పోలీసులు, వారి పౌర డ్రైవర్ మరణించారు.

Next Story