విషాదం.. పెన్సిల్ గొంతులో ఇర్కుక్కుని ఆరేళ్ల చిన్నారి మృతి
Tragedy in Uttar Pradesh.. A girl died after a pencil stuck in her throat. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్పూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెన్సిల్ షేవింగ్స్ గొంతులో
By అంజి Published on 22 Dec 2022 2:44 PM IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్పూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెన్సిల్ షేవింగ్స్ గొంతులో ఇరుక్కుపోయి ఆరేళ్ల బాలిక మృతి చెందింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది. ఒకటో తరగతి విద్యార్థిని గొంతులో పెన్సిల్ ఇరుక్కుపోయి విలవిల్లాడింది. హుటాహుటిన బంధువులు ఆస్పత్రికి తరలించినప్పటికీ బాలిక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనను తట్టుకోలేక బాలిక కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.
ఈ ఘటన కొత్వాలి ప్రాంతంలోని పహాడీ వీర్ గ్రామంలో జరిగింది. నందకిషోర్ అనే వ్యక్తి తన భార్యాపిల్లలతో ఈ గ్రామంలో నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం తన కుమారుడు అభిషేక్ (12), కూతురు అన్షిక (8), ఆర్తిక (6)లు టెర్రస్పై కూర్చుని చదువుకుంటున్నారని చెప్పాడు. హోమ్వర్క్ చేయడానికి, ఆర్తిక తన నోటిలో షార్పనర్ పెట్టుకుని పెన్సిల్ను తిప్పింది. అప్పుడు షార్పనర్ నుండి పెన్సిల్ షేవింగ్స్ బయటకు వచ్చి శ్వాసనాళంలో చిక్కుకుంది. దీంతో బాలిక ఊపరి ఆడకపోవడంతో నెలపై పడిపోయింది. కుటుంబసభ్యులు ఆర్తికను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆమె గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నదని మృతురాలి తండ్రి తెలిపారు. మరోవైపు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారని వైద్యులు చెబుతున్నారు. సిహెచ్సి డాక్టర్ సత్యేంద్రకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. చిన్న పిల్లలపై నిఘా పెట్టాలన్నారు. దీని వల్ల ప్రమాదాలు నివారించవచ్చు. అలాగే కొందరు పిల్లలు పడుకుని తిండి లేక నీళ్లు తాగుతున్నారని తెలిపారు. శ్వాసనాళంలో ఆహారం ఇరుక్కుపోయి మరణానికి దారితీయవచ్చు కాబట్టి ఇది వారి జీవితానాకి ప్రాణాంతకం.
పిల్లలు పెన్ను-పెన్సిల్ను జాగ్రత్తగా వాడాలని డాక్టర్లు చెప్పారు. ఇవి పిల్లల కంటికి హాని కలిగిస్తాయి. మంచంపై పడివున్న పెన్సిల్, పెన్ను అజాగ్రత్తగా ఉండటం వల్ల శరీరంపై గుచ్చుకునే అవకాశం ఉంది. పిల్లలకు ఏదైనా నోటిలో పెట్టుకునే అలవాటు ఉంటుందని, దీన్ని తల్లిదండ్రులు చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాలిక మృతితో గ్రామమంతా విషాదం అలుముకుంది.