మార్చి 15 నుంచి దంచికొట్టుడే..ఎండల తీవ్రతపై నిపుణుల హెచ్చరిక

దేశంలో ఈ సంవత్సరం ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదు అవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

By Knakam Karthik
Published on : 15 Feb 2025 7:25 AM IST

Telugu News, National, Temperatures, Imd

మార్చి నుంచి 15 నుంచి దంచికొట్టుడే..ఎండల తీవ్రతపై నిపుణుల హెచ్చరిక

దేశంలో ఈ సంవత్సరం ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదు అవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి 15 నుంచి ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని.. రాత్రి వాతావరణం వేడిగా ఉంటుందని తెలిపారు. స్పెషల్‌గా నార్త్ ఇండియా ప్రాంతంలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో జరుగుతున్న మార్పులు ఈ ఉష్ణోగ్రతల పెరుగుదలకి ప్రధాన కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఈ మార్పులు అంతర్జాతీయ కాలుష్యం, గ్రీన్ హౌస్ గ్యాస్ లవణాలు, కార్బన్ డయాక్సైడ్, మిథైన్ వాయువుల వృద్ధితో సంబంధించినవి. ఈ గ్యాస్ ల పెరుగుదల కారణంగా భూమి మీద ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.

ఈ తీవ్రమైన ఎండలు ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దీర్ఘకాలం వేడి వాతావరణంలో నిలబడటం వల్ల డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఈ పరిస్థితుల నుండి మరింత ప్రభావితమవుతారు. వాతావరణం వేడిగా ఉండటం వల్ల రాత్రిపూట కూడా వాతావరణం సుష్కంగా, వేడి వుంటుంది. మార్చి 15 తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగి, కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా వేడి వాతావరణం ఏర్పడుతుంది. ఈ వేడి వాతావరణంలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది.

అయితే, ఈ వేడి వాతావరణం ప్రజల జీవనశైలిని, వ్యవసాయ కార్యకలాపాలను, ఇతర సామాన్య కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు.రక్షణ చర్యలు ఈ ఉష్ణోగ్రతల నుంచి రక్షణ పొందడానికి ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకంగా అధిక ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా నివారించాలి. శరీరాన్ని తడిపించుకునే, నీళ్లు తాగడం, సూర్యరశ్మి నుండి రక్షణ పొందే విధంగా పరికరాలను ఉపయోగించడం ముఖ్యమైంది. ప్రభుత్వాలు కూడా ప్రజల ప్రాణ రక్షణ కోసం జాగ్రత్త చర్యలు చేపట్టాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

Next Story