గణేష్‌ విగ్రహానికి పూజ చేసిందని.. విద్యార్థిని చేతిని విరగ్గొట్టిన టీచర్‌

కర్ణాటకలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ పాఠశాలలో గణేష్ విగ్రహానికి పూజలు చేసినందుకు విద్యార్థిని చేతిని టీచర్‌ విరగ్గొట్టింది.

By అంజి  Published on  21 Sep 2023 5:09 AM GMT
worship , Ganesh statue, Karnataka,  Kolar district

గణేష్‌ విగ్రహానికి పూజ చేసిందని.. విద్యార్థిని చేతిని విరగ్గొట్టిన టీచర్‌

కర్ణాటకలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ పాఠశాలలో గణేష్ విగ్రహానికి పూజలు చేసినందుకు విద్యార్థిని చేతిని టీచర్‌ విరగ్గొట్టింది. దీంతో కోలార్ విద్యాశాఖ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది. బుధవారం నాడు సెప్టెంబర్ 20, కోలార్ జిల్లా, కేజీఎఫ్ తాలూకాలోని అల్లికల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హేమలతను కోలార్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తి ఆదేశం మేరకు సస్పెండ్ చేశారు. విద్యార్థిని వైద్య ఖర్చులు కూడా చూసుకోవాలని హేమలతను ఆదేశించారు.

గత వారం పాఠశాలలో గణేష్ విగ్రహానికి పూజ చేసినందుకు ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థిని భవ్యను కొట్టింది. భవ్యకు విధించిన శిక్ష ఎంత తీవ్రంగా ఉందో, ఆమె ఎడమ చేతికి ఫ్రాక్చర్ అయింది. బాలిక తల్లిదండ్రులు కేజీఎఫ్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో)కి ఫిర్యాదు చేసి ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గాయపడిన విద్యార్థినిని బీఈవో మునివెంకటరామాచారి పరామర్శించి, సస్పెండ్ అయిన ప్రధానోపాధ్యాయుడిపై నివేదిక సమర్పించారు.

ఇటీవల జరిగిన మరో సంఘటనలో జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో బ్లాక్‌బోర్డ్‌పై “జై శ్రీరాం” అని వ్రాసినందుకు ఒక విద్యార్థిని కొట్టినందుకు ఒక పాఠశాల ఉపాధ్యాయుడు, ప్రిన్సిపాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కథువాలోని నగ్రి పరోల్ ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్లాక్‌బోర్డ్‌పై రాసిన నినాదాన్ని చూసిన పాఠశాల ఉపాధ్యాయుడు కోపంతో విద్యార్థిని కర్రతో కొట్టాడు. ప్రిన్సిపాల్ కూడా దాడిలో చేరి విద్యార్థిని గదిలో బంధించాడు.

విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), జువైనల్ జస్టిస్ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Next Story