ఘోర ప్రమాదం.. ఏడుగురు మహిళలు దుర్మరణం

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on  11 Sep 2023 10:27 AM GMT
Tamilnadu, Accident, 7 woman Dead ,

ఘోర ప్రమాదం.. ఏడుగురు మహిళలు దుర్మరణం

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇక మరికొందరికి తీవ్రగాయాలు కాగా.. వారిని అధికారులు ఆస్పత్రికి తరలించి.. చికిత్స చేయిస్తున్నారు.

ఈ నెల 8న తమిళనాడులోని వెల్లూరు జిల్లాకు చెందిన 24 మంది పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఓ మినీ వ్యాన్‌లో కర్ణాటక వెళ్లారు. ఇక మూడ్రోజుల పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించిన తర్వాత తిరిగి.. తమిళనాడుకు పయనం అయ్యారు. సోమవారం తెల్లవారుజామున బెంగళూరు-చెన్నై రహదారిపై ఆగిపోయింది. ఎంతకీ స్టార్ట్‌ కాలేదు. ఆ తర్వాత ఆ వాహనాన్ని ఉదయం 3 గంటలకు అలా తిరుపత్తూరు జిల్లా నట్రంపల్లి శివారులో పార్క్‌ చేశారు. ఆ వాహనానికి మరమ్మతులు ప్రారంభించారు. అయితే.. బస్సులోని మహిళలు కొందరు కిందకు దిగి రోడ్డుపక్కనే కూర్చొన్నారు. అంతలోనే యుముడి రూపంలో ఓ లారీ దూసుకొచ్చింది. మరమ్మతులు జరుగుతున్న వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. దాంతో.. ఆ వాహనం రోడ్డుపై కూర్చొన్న మహిళలపైకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ఏడుగురు మహిళలు అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయారు. మినీ బస్సు వారి మీదనుంచి దూసుకెళ్లడంతో మృతదేహాలన్నీ చితికిపోయాయి. మరో 10 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. అయితే.. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికితరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఈ దుర్ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుంటుబాలకు రూ.లక్ష చొప్పున,.. క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. ఇక మృతులందరినీ గుర్తించామని.. వారి వారి బంధువులకు మృతదేహాలను అప్పగించినట్లు తెలిపారు.

Next Story