కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) గా సుశీల్చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సునీల్ ఆరోరా పదవీకాలం సోమవారంతో ముగిసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త సీఈసీగా సుశీల్ చంద్ర మంగళవారం బాధ్యతలు స్వీకరిస్తారని న్యాయశాఖ తెలిపింది. సుశీల్ చంద్ర ఈ పదవిలో వచ్చే ఏడాది మే 14 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక సుశీల్ చంద్ర పదవిలో కాలంలో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.