గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ హత్యపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ల హత్యలపై విచారణ కోరుతూ దాఖలైన

By అంజి  Published on  18 April 2023 7:30 AM GMT
Supreme Court , Atiq Ahmed, National news

గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ హత్యపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ల హత్యలపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. హత్యలపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఏప్రిల్ 24న కేసు విచారణకు రానుంది. న్యాయవాది విశాల్ తివారీ స్వతంత్ర నిపుణుల కమిటీ దర్యాప్తును కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2017 నుండి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 183 ఎన్‌కౌంటర్లపై విచారణను కూడా కోరారు.

శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని ఒక మెడికల్ కాలేజీకి చెక్ అప్ కోసం పోలీసు సిబ్బంది ఎస్కార్ట్ చేస్తున్న సమయంలో అహ్మద్, అతని సోదరుడిని ముగ్గురు దుండగులు జర్నలిస్టులు నటిస్తూ పోలీసుల ముందే కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా) పేర్కొన్న విధంగా 2017 నుండి జరిగిన 183 ఎన్‌కౌంటర్‌లపై విచారణ జరిపి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా న్యాయ పాలనను కాపాడేందుకు మార్గదర్శకాలను కోరింది. గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌పై కూడా సీబీఐ చేత విచారణ చేపట్టాలని పిటిషనర్‌ కోరారు. పిటిషనర్ పోలీసు కస్టడీలో ఉన్న అహ్మద్, అతని సోదరుడి హత్యపై దర్యాప్తును కోరారు.

"పోలీసుల ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి, చట్టానికి తీవ్రమైన ముప్పు, పోలీసు రాజ్యానికి దారితీస్తాయి" అని నొక్కి చెప్పారు. ఇలాంటి హత్యలు లేదా బూటకపు పోలీసు ఎన్‌కౌంటర్‌లకు చట్టం కింద స్థానం లేదని, అలాగే శిక్షాస్మృతికి మాత్రమే అధికారం ఉన్నందున ప్రజాస్వామ్య సమాజంలో అంతిమ న్యాయాన్ని అందించే పద్ధతిగా మారడానికి పోలీసులను అనుమతించలేమని పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసులు డేర్‌ డెవిల్స్‌గా మారితే న్యాయవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో వ్యక్తి హత్యకు గురికావడం.. మొత్తం పోలీసు వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోందన్నారు.

Next Story