కాశ్మీర్‌లో సైనికుడు అదృశ్యం.. కారులో రక్తం మరకల గుర్తింపు

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఈద్ సందర్భంగా తన ఇంటికి వచ్చిన సైనికుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. శనివారం రాత్రి నుంచి జవాన్ కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

By అంజి  Published on  30 July 2023 3:30 AM GMT
Soldier missing , Kashmir, Kulgam, National news

కాశ్మీర్‌లో సైనికుడు అదృశ్యం.. కారులో రక్తం మరకల గుర్తింపు

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఈద్ సందర్భంగా తన ఇంటికి వచ్చిన సైనికుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. శనివారం రాత్రి నుంచి జవాన్ కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు గల్లంతైన జవాన్ ఆచూకీ కోసం సైన్యం, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. సెర్చ్ ఆపరేషన్‌లో జవాన్ కారులో అతని చెప్పులు మరియు రక్తపు మరకలను ఆర్మీ గుర్తించింది. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా దిగ్బంధనం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఈద్ సెలవుపై ఇంటికి తిరిగి వచ్చిన 25 ఏళ్ల సైనికుడు జావేద్ అహ్మద్ వనీని అతని వాహనం నుండి కిడ్నాప్ చేసినట్లు మీడియాలో కథనాలు ఉన్నాయి.

జావేద్ అహ్మద్ వనీ లేహ్ (లడఖ్)లో ఉన్నట్లు నివేదించబడిందని, శనివారం రాత్రి 8 గంటల నుండి తప్పిపోయాడని అతని కుటుంబం పేర్కొంది. అపహరణకు గురైన సైనికుడి ఆచూకీ కోసం భారత సైన్యం, పోలీసులు భారీ సెర్చ్,కార్డన్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ ప్రాంతంలో దిగ్బంధనం చేశారు. జావేద్ శనివారం సాయంత్రం కిరాణా సామాను కొనేందుకు చౌవల్గామ్‌కు తన కారులో వెళ్లినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. అతడు ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో వెతకడం ప్రారంభించామని కుటుంబీకులు చెబుతున్నారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో, పరన్హాల్ గ్రామంలో అతని కారులో ఒక జత చెప్పులు మరియు రక్తపు మరకలు కనుగొనబడ్డాయి. కారు అన్‌లాక్ చేయబడింది.

Next Story