క్రాస్‌ ఓటింగ్ రగడ.. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత

రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్‌ ఓటింగ్‌ వేసిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై గురువారం హిమాచల్‌ అసెంబ్లీ నుంచి స్పీకర్‌ అనర్హత వేటు వేశారు.

By అంజి  Published on  29 Feb 2024 7:30 AM GMT
Congress MLAs, cross voting, BJP, Himachal Pradesh

క్రాస్‌ ఓటింగ్ రగడ.. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత

హిమాచల్‌ప్రదేశ్‌ స్పీకర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్‌ ఓటింగ్‌ వేసిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై గురువారం హిమాచల్‌ అసెంబ్లీ నుంచి స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద సభ్యులను అనర్హులుగా ప్రకటించారు. "కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసిన ఆరుగురు ఎమ్మెల్యేలు తమపై ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను ఆకర్షించారు... ఆ ఆరుగురు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో తక్షణమే సభ్యులుగా ఉండడాన్ని నిలిపివేసినట్లు నేను ప్రకటిస్తున్నాను" స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియన్ ప్రకటించారు.

అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, దేవిందర్ కుమార్ భూటూ, రవి ఠాకూర్ , చెతన్య శర్మ. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 34 సీట్లకు పడిపోయింది. సీఎం సుఖ్విందర్‌ సింగ్ ఇంట్లో నేతలు అంతా సమావేశమై చర్చిస్తున్నారు. మరోవైపు బలం నిరూపించుకునేందుకు తమకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను బీజేపీ కోరింది. కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసిన తర్వాత ముగ్గురు కాంగ్రెస్, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ ఆధ్వర్యంలోని హర్యానాలోని పంచకులలోని అతిథి గృహంలో క్యాంప్ చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.

నిన్న సభలో ఆర్థిక బిల్లుపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడానికి పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు వారిని అనర్హులుగా ప్రకటించారని అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఈరోజు ప్రకటించారు. 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయడంతో అసెంబ్లీ రాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదించింది. ఆరుగురు ఎమ్మెల్యేల చర్యలు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించాయని స్పీకర్ అన్నారు.

Next Story