బీజేపీ-జేడీఎస్ కార్యకర్తల మధ్య గొడవలు.. తుముకూరులో ఉద్రిక్త పరిస్థితులు

Several injured after BJP and JDS workers clash in Tumakuru. కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి

By Medi Samrat  Published on  22 April 2023 8:12 AM GMT
బీజేపీ-జేడీఎస్ కార్యకర్తల మధ్య గొడవలు.. తుముకూరులో ఉద్రిక్త పరిస్థితులు

కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ సెక్యులర్ మద్దతుదారుల మధ్య ఘర్షణ చెలరేగడంతో పలువురు గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. "ముబారక్ పాషా, నజీర్ అనే ఇద్దరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిపై జెడిఎస్ కార్యకర్తలు దాడి చేశారు" అని బీజేపీ నాయకులు ఒకరు తెలిపారు. జేడీఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై గాజు సీసాలు, కత్తులతో దాడి చేశారని స్థానిక దుకాణదారులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి తుమకూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తుమకూరులో బీజేపీ, జేడీఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో కార్మికులు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు.

గత కొద్దిరోజులుగా కర్ణాటకలో పలు పార్టీల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గత నెల ప్రారంభంలో, బెంగళూరులోని గోవింద్‌రాజ్‌నగర్ నియోజకవర్గంలోని ఒక గ్రౌండ్‌లో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడటంతో కర్ణాటక పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మార్చి 19న మహిళా సమ్మేళనం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు బ్యానర్లు, నాయకుల పోస్టర్లు పెట్టడాన్ని బీజేపీ మద్దతుదారులు వ్యతిరేకించడంతో ఘర్షణ చోటుచేసుకుంది.


Next Story