ఘోర ప్రమాదం.. ముగ్గురు చిన్నారులతో సహా 9 మంది మృతి

చత్తీస్‌గఢ్‌లోని బెమెతరా జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  29 April 2024 4:31 AM GMT
road accident, chhattisgarh, 9 people dead,

ఘోర ప్రమాదం.. ముగ్గురు చిన్నారులతో సహా 9 మంది మృతి

చత్తీస్‌గఢ్‌లోని బెమెతరా జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కతియా వద్ద ఆగి వున్న లారీని ఓ మినీ వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ సంఘటనలో వ్యానులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడ్డవారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో మృతిచెందిన వివరాలను తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు బెమెతరా జిల్లా కలెక్టర్ రణ్‌వీర్‌ శర్మ చెప్పారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని చికిత్స కోసం ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌కి తరలించామని కలెక్టర్‌ చెప్పారు. మినీ వ్యాన్‌లో బాధితులంతా ఓ శుభకార్యానికి హాజరు అయ్యి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు.


Next Story