'ఆహ్వానించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మా తప్పు లేదు' : కర్ణాటక ప్రభుత్వం

కర్ణాటక ప్రభుత్వం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) లను ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటకు కారణమని ఆరోపించింది

By Medi Samrat
Published on : 11 Jun 2025 5:35 PM IST

ఆహ్వానించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మా తప్పు లేదు : కర్ణాటక ప్రభుత్వం

కర్ణాటక ప్రభుత్వం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) లను ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటకు కారణమని ఆరోపించింది. ఈ కార్యక్రమానికి ఎటువంటి అనుమతి తీసుకోలేదని, నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా అందరినీ ఆహ్వానించారని హైకోర్టుకు తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించి తమ అరెస్టుల చట్టబద్ధతను సవాలు చేస్తూ RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలేతో సహా నలుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్ల పునః విచారణ సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చింది. జస్టిస్ SR కృష్ణ కుమార్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ విచారిస్తోంది.

కర్ణాటక రాష్ట్రం తరపున వాదించారు అడ్వకేట్ జనరల్ శశి కిరణ్ శెట్టి. ఈ సంఘటనకు బాధ్యత వహించే పార్టీలలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది, ఈ కార్యక్రమానికి భద్రత, గేట్, టిక్కెట్ నిర్వహణకు సంబంధించి ఆర్‌సిబి, బీసీసీఐ మధ్య ఒప్పందం ఉందని వాదించింది.

Next Story