రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్..ఆ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్
రైల్వన్ యాప్ ద్వారా టికెట్టు కొనుగోలు చేస్తున్న వారికి రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది.
By - Knakam Karthik |
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్..ఆ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్
రైల్వన్ యాప్ ద్వారా టికెట్టు కొనుగోలు చేస్తున్న వారికి రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది. డిజిటల్ పేమెంట్ మోడల్లో రైల్వన్ యాప్ ద్వారా అన్రిజర్వుడు టికెట్లను కొనుగోలు చేస్తే 3 శాతం రాయితీ అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
అయితే ఈ ఆఫర్కు అనుగుణంగా సాఫ్ట్వేర్ వ్యవస్థలో మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్-CRISకు రైల్వే శాఖ సూచించింది. ఈ నిర్ణయంపై మే నెలలో ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రైల్వన్ యాప్లో ఆర్-వాలెట్ ద్వారా టికెట్ కొనుగోళ్లపై వస్తున్న క్యాష్బ్యాక్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇతర వేదికలపై కొనుగోలు చేసే అన్రిజర్వుడు టికెట్లకు ఈ ఆఫర్ వర్తించదని వెల్లడించింది. డిజిటల్ టికెట్ల కొనుగోళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైలు టికెట్, ప్లాట్ఫామ్ టికెట్, ట్రైన్లైవ్ ట్రాకింగ్, జర్నీలో ఫుడ్ బుకింగ్ ఇవన్నీ ఒక్క చోట అందించే ఉద్దేశంతో భారతీయ రైల్వే 'రైల్వన్ యాప్'ను తీసుకొచ్చింది.
రైల్వన్ యాప్ ద్వారా అన్రిజర్వుడు మరియు ప్లాట్ఫామ్ టిక్కెట్లను ఏ డిజిటల్ పేమెంట్ విధానం (యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డ్లు, నెట్ బ్యాంకింగ్) ద్వారా కొనుగోలు చేసినా ఈ 3 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్పెషల్ ఆఫర్ 2026 జనవరి 14 నుండి జూలై 14 వరకు (ఆరు నెలలు) మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఆర్-వాలెట్ (R-Wallet) ద్వారా చెల్లింపులు చేసేవారికి లభిస్తున్న 3 శాతం క్యాష్బ్యాక్ యథాతథంగా కొనసాగుతుంది. కొత్తగా ఇతర డిజిటల్ పేమెంట్లకు కూడా ఈ డిస్కౌంట్ వర్తించేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS)ను రైల్వే శాఖ ఆదేశించింది.
ఇటీవల ఛార్జీల పెంపు
కాగా రైల్వే శాఖ కొత్తగా ప్రతిపాదించిన ఛార్జీల పెంపు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతి కిలోమీటర్కు స్వల్పంగా (1 లేదా 2 పైసల) పెంపు ఉన్నా సబర్బన్ ప్రయాణికులు, సీజనల్ టికెట్ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఛార్జీల పెంపుతో ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు కల్లా అంటే 2026 మార్చి 31 కల్లా రూ.600 కోట్లు అదనంగా సంపాదించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.