బెంగళూరులో కలకలం..విద్యార్థిని 'ఉగ్రవాది'అని సంబోధించిన ప్రొఫెసర్!

బెంగళూరులోని పీఈఎస్ విశ్వవిద్యాలయంలో మైనారిటీ వర్గానికి చెందిన ఒక విద్యార్థి పట్ల ప్రొఫెసర్ అనుచితంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది

By -  Knakam Karthik
Published on : 28 March 2026 3:17 PM IST

National News, Bengaluru, PES University, Professor Suspended, NoToDiscrimination, ViralVideo, ClassroomControversy

బెంగళూరులో కలకలం..విద్యార్థిని 'ఉగ్రవాది'అని సంబోధించిన ప్రొఫెసర్!

బెంగళూరులోని పీఈఎస్ విశ్వవిద్యాలయంలో మైనారిటీ వర్గానికి చెందిన ఒక విద్యార్థి పట్ల ప్రొఫెసర్ అనుచితంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. మేనేజ్‌మెంట్ కామర్స్ అండ్ ఆర్ట్స్ విభాగంలో అడ్జంక్ట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మురళీధర్ దేశ్‌పాండే, తరగతి గదిలో ఒక విద్యార్థిని పదేపదే "ఉగ్రవాది" అని పిలిచినట్లు ఆరోపణలు వచ్చాయి. మంగళవారం తరగతి జరుగుతున్న సమయంలో సదరు విద్యార్థి మాట్లాడుతుండగా గమనించిన ప్రొఫెసర్, అతని ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ "అందుకే నిన్ను ఉగ్రవాది అని పిలుస్తాను" అని వ్యాఖ్యానించారు. ఈ దృశ్యాలను తోటి విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై విశ్వవిద్యాలయ యాజమాన్యం తక్షణమే స్పందించింది. విచారణ పూర్తయ్యే వరకు ప్రొఫెసర్ మురళీధర్ దేశ్‌పాండేను సస్పెండ్ చేస్తూ వైస్ ఛాన్సలర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ఈ ఉదంతంపై నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) బెంగళూరు నగర అధ్యక్షుడు లక్ష్య రాజ్ గిరి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బనశంకరి 3వ దశలో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ వివక్ష పూరిత ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రొఫెసర్ వ్యాఖ్యలు మైనారిటీ వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story