రాష్ట్రంలో సంచలనం..బీజేపీ ఎమ్మెల్యేపై రేప్, కిడ్నాప్, పోక్సో కేసు
బీజేపీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు కావడం హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలలో తీవ్ర కలకలం రేపింది.
By - Knakam Karthik |
రాష్ట్రంలో సంచలనం..బీజేపీ ఎమ్మెల్యేపై రేప్, కిడ్నాప్, పోక్సో కేసు
బీజేపీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు కావడం హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలలో తీవ్ర కలకలం రేపింది. చురా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడుసార్లు బిజెపి ఎమ్మెల్యేగా ఎన్నికైన హన్స్ రాజ్ పై పోక్సో కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఆయన వ్యక్తిగత సహాయకుడు, మరో సన్నిహితుడిపై కిడ్నాప్ అభియోగంపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
మైనర్గా ఉన్నప్పుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, పెళ్లి పేరుతో మోసం చేశారని ఓ యువతి ఆరోపించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ 6 కింద లైంగిక సంబంధం, భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్ 69 కింద వివాహం చేసుకుంటానని తప్పుడు హామీ ఇచ్చి లైంగిక సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలపై శుక్రవారం ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న అనంతరం శుక్రవారం ఎమ్మెల్యే హన్స్రాజ్పై కేసు నమోదు చేశారు. చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక (పోక్సో) చట్టంలోని సెక్షన్ 6 (తీవ్రమైన లైంగిక దాడి), భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 69 (పెళ్లి పేరుతో మోసగించి లైంగిక దాడి) కింద ఈ కేసు ఫైల్ చేసినట్లు చంబా అదనపు ఎస్పీ హితేష్ లఖన్పాల్ శనివారం ధ్రువీకరించారు. బాధితురాలు మైనారిటీ వర్గానికి చెందిన యువతి అని, ఘటన జరిగిన సమయంలో తాను మైనర్నని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే హన్స్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు ప్రత్యర్థులు పన్నిన కుట్ర అని ఆయన కొట్టిపారేశారు.
కేసు నేపథ్యం ఇదే..
గత సంవత్సరం ప్రారంభంలో, ఎమ్మెల్యే అశ్లీల సందేశాలు పంపారని, నగ్న ఫోటోలు డిమాండ్ చేశారని ఆ బాలిక ఆరోపించింది. దీనిపై పోలీసు ఫిర్యాదు నమోదు చేయబడి, దర్యాప్తు తర్వాత పోలీసులు క్లోజర్ రిపోర్ట్ ఇచ్చారు. అయితే, ఈ ఏడాది నవంబర్ 2న, ఆ మహిళ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసి, ఎమ్మెల్యే తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించింది. అధికారులు తన తండ్రిని వేధిస్తున్నారని, ఎమ్మెల్యే సహచరులు తన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని కూడా ఆమె ఆరోపించింది.
ఈ క్రమంలో, బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. గతేడాది ఎమ్మెల్యే హన్స్రాజ్, ఆయన అనుచరులు తనను, తన కుమార్తెను బలవంతంగా సిమ్లాకు తీసుకెళ్లి, మొబైల్ ఫోన్లు లాక్కుని, బెదిరించి ఒక స్క్రిప్టెడ్ వీడియో రికార్డ్ చేయించారని ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఎమ్మెల్యే సహాయకులు ఇద్దరిపై కిడ్నాపింగ్, బెదిరింపుల కింద కేసు నమోదైంది. ఆ తర్వాత బాధితురాలి వాంగ్మూలంతో నేరుగా ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చంబా ఎస్పీని ఆదేశించింది.