మే 2 నుంచి ప్ర‌ధాని మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌

PM to undertake three-nation tour in the first week of May.మే 2 నుంచి మూడు రోజుల పాటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మూడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 April 2022 6:39 AM GMT
మే 2 నుంచి ప్ర‌ధాని మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌

మే 2 నుంచి మూడు రోజుల పాటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మూడు దేశాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంవ‌త్స‌రంలో ప్ర‌ధాని తొలి విదేశీ ప‌ర్య‌ట‌న ఇదే. మొద‌ట ఆయ‌న జ‌ర్మ‌నీకి వెళ్ల‌నున్నారు. అక్క‌డి నుంచి ప్ర‌ధాని డెన్మార్క్ వెలుతారు. తిరుగుప్ర‌యాణంలో మే 4న ప్యారిస్‌కు చేరుకోనున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రధాని మోదీ.. బెర్లిన్‌లో జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. భార‌త్‌-జ‌ర్మ‌నీ అంత‌ర్ ప్ర‌భుత్వ సంప్ర‌దింపుల ఆరో విడ‌త స‌మావేశాల‌కు సంయుక్తంగా అధ్య‌క్ష‌త వ‌హిస్తారు. వాణిజ్య‌వేత్త‌ల్ని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ప్ర‌వాస భార‌తీయుల‌తో స‌మావేశం కానున్నారు. ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం గురించి మూడు దేశాల నేత‌ల‌తో చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

అనంతరం డెన్మార్క్ ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ కోపెన్ హగన్ వెళ్లనున్నారు. అక్కడ డెన్మార్క్ ప్రభుత్వం ఆతిథ్యమిస్తున్న రెండవ ఇండియా నార్దిక్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఈ సదస్సులో ఐస్ల్యాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ప్రధాన మంత్రుల తో మోదీ చర్చించనున్నారు. కరోనా అనంతరం ఆర్థిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, నూతన ఆవిష్కరణలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రపంచ భద్రత వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి.

Next Story