నీరు అందని పరిస్థితి ఏర్పడుతుంది.. మనం చాలా జాగ్రత్త పడాలి: మోదీ
PM Narendra Modi's Mann ki Baat address. భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో వాన నీటి సంరక్షణ గురించి ఆయన
By Medi Samrat Published on 28 Feb 2021 6:47 PM IST
కేంద్ర జల శక్తి శాఖ 'పడిన చోటే.. పడిన వెంటనే.. వాన నీటిని ఒడిసి పడదాం (క్యాచ్ ద రెయిన్)' అనే నినాదంతో ఓ మంచి కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించబోతోందన్నారు. ఇంకుడు గుంతలను బాగు చేయాలని, జలవనరుల్లోకి వాన నీరు వెళ్లే మార్గాలను శభ్రం చేయాలని ప్రధాని సూచించారు.
హైదరాబాద్ కు చెందిన చింతల వెంకట్ రెడ్డి అనే రైతు గురించి ప్రధాని ప్రస్తావించారు భారత ప్రధాని. ''ఓ రోజు వెంకట్ రెడ్డికి స్నేహితుడైన ఓ డాక్టర్.. విటమిన్ డీ లోపంతో ఎలాంటి జబ్బులు వస్తున్నాయో, దానితో ఉన్న ప్రమాదమేంటో వెంకట్ రెడ్డికి చెప్పారు. అప్పుడే రైతు అయిన వెంకట్ రెడ్డి.. ఆ సమస్యను ఎలా తీర్చాలని ఆలోచించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి విటమిన్ డీ కలిగిన వరి, గోధుమలను ఆయన పండించారు. ఈ నెలలోనే ఆయన పంటకు జెనీవాలోని ప్రపంచ మేధో హక్కుల సంస్థ.. పేటెంట్ హక్కులు కూడా ఇచ్చింది. అలాంటి వ్యక్తికి గత ఏడాది పద్మ శ్రీ పురస్కారం ఇవ్వడం మా ప్రభుత్వానికి దక్కిన గౌరవం'' అని చెప్పుకొచ్చారు.