పహల్గామ్ ఉగ్రదాడి నిందితులు వీళ్లే.. సూత్రధారి ఎల్‌ఈటీ కమాండర్ సైఫుల్లా

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఫొటోలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి.

By Knakam Karthik
Published on : 23 April 2025 1:58 PM IST

National News, Jammu Kashmir, Pahalgam Terror Attack, Photos Of Terrorists

పహల్గామ్ ఉగ్రదాడి నిందితులు వీళ్లే.. సూత్రధారి ఎల్‌ఈటీ కమాండర్ సైఫుల్లా

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఫొటోలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులుఉ మరణించగా, అనేక మంది గాయపడిన దాడి వెనుక ఉన్న నిందితులను భద్రతా సంస్థలు గుర్తించాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యులుగా దాడిచేసిన వ్యక్తులను భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. ఇటీవలి కాలంలో కాశ్మీర్‌లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడులలో ఒకటైన పహల్గామ్‌లోని ప్రసిద్ధ బైసారన్ గడ్డి మైదానంలో పర్యాటకులపై కాల్పులు జరిపారు.

భద్రతా సంస్థల సమాచారం ప్రకారం.. కనీసం 5–6 మంది ఉగ్రవాదులు, మభ్యపెట్టే దుస్తులు, కుర్తా-పైజామాలు ధరించి, లోయ చుట్టూ ఉన్న దట్టమైన పైన్ అడవి నుండి బైసరన్ గడ్డి మైదానానికి వచ్చి AK-47 లతో కాల్పులు జరిపారు. దాడికి కొన్ని రోజుల ముందు లోయలోకి చొరబడిన పాకిస్తానీ ఉగ్రవాదులు ఈ బృందంలో ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మారణహోమానికి ప్రధాన సూత్రధారి ఎల్‌ఇటి కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ అని నిఘా సంస్థలు గుర్తించాయి. అటవీ ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుని అక్కడి నుంచి పారిపోయిన ఉగ్రవాదులను గుర్తించడానికి భద్రతా దళాలు భారీ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించాయి.

Next Story