తప్పిన భారీ ప్రమాదం.. విరిగిన చక్రంతో 10 కి.మీ నడిచిన రైలు

బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ముజఫర్‌పూర్ జిల్లాలో ముంబైకి వెళ్లే పవన్ ఎక్స్‌ప్రెస్ విరిగిన చక్రంతో 10 కిలోమీటర్లు దూసుకెళ్లింది.

By అంజి  Published on  3 July 2023 11:11 AM IST
Pawan express, Bihar, Bhagwanpur railway station

తప్పిన భారీ ప్రమాదం.. విరిగిన చక్రంతో 10 కి.మీ వెళ్లిన రైలు

బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ముజఫర్‌పూర్ జిల్లాలో ముంబైకి వెళ్లే పవన్ ఎక్స్‌ప్రెస్ విరిగిన చక్రంతో 10 కిలోమీటర్లు దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదం బారి నుండి ప్రయాణికులు అద్భుతంగా తప్పించుకున్నారని సోమవారం వర్గాలు తెలిపాయి. ఆదివారం అర్థరాత్రి భగవాన్‌పూర్ రైలు వద్ద ముజఫర్‌పూర్-హాజీపూర్ రైలు సెక్షన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన వెంటనే ఎస్‌-11 కోచ్‌లో పెద్ద శబ్దం వినిపించింది. వేగంగా వెళుతున్న రైలు భగవాన్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పుడు సమస్యను గుర్తించే ప్రయత్నాలు చేయలేదు. చివరకు "రైలు భగవాన్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరినప్పుడు, ప్రయాణికులు చైన్ లాగి ఆపారు" అని ఒక ప్రయాణీకుడు రాజు కుమార్ తెలిపారు.

ప్రయాణికులు రైల్వే ఉద్యోగులతో పాటు రైలు డ్రైవర్‌, గార్డులకు సమాచారం అందించారు. తనిఖీల్లో ఎస్‌-11 కోచ్‌ చక్రం విరిగిపోయినట్లు గుర్తించారు. రైల్వే ఇంజినీర్లు, ఉద్యోగులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని చక్రాన్ని సరిచేశారు. “పవన్ ఎక్స్‌ప్రెస్‌లో చక్రం విరిగిందని మాకు సమాచారం అందింది. మా బృందం అక్కడికి చేరుకుని లోపాన్ని సరిదిద్దింది” అని తూర్పు మధ్య రైల్వే హాజీపూర్ సీపీఆర్‌వో వీరేంద్ర కుమార్ తెలిపారు.

Next Story