బెంగళూరులో అదృశ్యమైన బాలుడు.. హైదరాబాద్‌లో ఆచూకీ

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో అదృశ్యమైన 12 ఏళ్ల బాలుడు పరిణవ్‌ హైదరాబాద్‌లోని నాంపల్లిలో దొరికాడు. పరిణవ్, డీన్స్ అకాడమీ, గుంజూరు బ్రాంచ్‌లో విద్యార్థి.

By అంజి  Published on  24 Jan 2024 4:30 AM GMT
Parinav, missing ,Bengaluru , Hyderabad

బెంగళూరులో అదృశ్యమైన బాలుడు.. హైదరాబాద్‌లో ఆచూకీ

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో అదృశ్యమైన 12 ఏళ్ల బాలుడు పరిణవ్‌ హైదరాబాద్‌లోని నాంపల్లిలో దొరికాడు. పరిణవ్, డీన్స్ అకాడమీ, గుంజూరు బ్రాంచ్‌లో విద్యార్థి. జనవరి 24న హైదరాబాద్ నాంపల్లి మెట్రో స్టేషన్‌లో ఉన్న బెంగళూరు వాసి అతడిని గుర్తించి నాంపల్లి రైల్వే అధికారులకు అప్పగించారు. పరిణవ్‌ ఆచూకీ లభించిన వెంటనే అతడి తల్లిదండ్రులు అప్రమత్తమై అతడితో ఫోన్‌లో మాట్లాడారు. పరిణవ్ తండ్రి సుఖేష్ మాట్లాడుతూ.. అతను ఆరోగ్యంగా ఉన్నాడని, క్షేమంగా ఉన్నాడు అని తెలిపారు. తన బిడ్డను కనుగొనడంలో సహాయం చేసిన అధికారులకు, ప్రతి ఒక్కరికి అతని తల్లి కృతజ్ఞతలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

జనవరి 21, ఆదివారం నాడు పరీణవ్ కనిపించకుండా పోయాడు. తన ట్యుటోరియల్ క్లాస్‌లు ముగించుకుని, సాధారణంగా తనను పికప్ చేసే తల్లిదండ్రుల కోసం ఎదురుచూడకుండా, అతను బస్సు ఎక్కాడు. జనవరి 21 సాయంత్రం వరకు మాత్రమే పోలీసులు అతని కార్యకలాపాలను సీసీ కెమెరాల ద్వారా కనుగొనగలిగారు. బెంగళూరులోని అతని తల్లిదండ్రులు, పౌరులు, ప్రజా సంఘాలు, పోలీసులు అతని కోసం తీవ్రంగా వెతిరారు. జనవరి 23 రాత్రి బెంగుళూరులోని మెజెస్టిక్ రైల్వే స్టేషన్‌లో పరిణవ్‌ని చివరిసారిగా కనిపించాడు.

Next Story