మతపరమైన ఊరేగింపులో 'పాలస్తీనా తరహా' జెండా కలకలం

ఒడిశాలోని కటక్‌లో సోమవారం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో పాలస్తీనా జెండాను ఊపుతూ ఓ వ్యక్తి కనిపించడంతో కొద్దిసేపు ఊరేగింపును ఆపివేశారు.

By అంజి
Published on : 17 Sept 2024 7:21 AM IST

Palestine like flag, religious procession, Odisha

మతపరమైన ఊరేగింపులో 'పాలస్తీనా తరహా' జెండా కలకలం

ఒడిశాలోని కటక్‌లో సోమవారం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో పాలస్తీనా జెండాను ఊపుతూ ఓ వ్యక్తి కనిపించడంతో కొద్దిసేపు ఊరేగింపును ఆపివేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నగరంలోని దర్గా బజార్‌లో జరిగినట్లు వారు తెలిపారు. ఊరేగింపులో, పాలస్తీనా జెండాను పోలిన జెండాతో ఒక యువకుడు కనిపించాడు, మేము జెండాను స్వాధీనం చేసుకున్నాము. అలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని యువతను హెచ్చరించినట్లు అదనపు డిసిపి అనిల్ మిశ్రా విలేకరులతో అన్నారు.

ఊరేగింపును కొద్దిసేపు నిలిపివేసి, కాసేపటి తర్వాత సీనియర్ పోలీసు అధికారులు నిర్వాహకులతో చర్చలు జరిపిన తర్వాత తిరిగి ప్రారంభమైందని తెలిపారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జెండాను స్వాధీనం చేసుకున్నట్లు మిశ్రా తెలిపారు. "పాలస్తీనా జెండాలో మూడు రంగులు. ఒక త్రిభుజం ఉన్నాయి. అయితే, పోలీసులు స్వాధీనం చేసుకున్న జెండాలో మూడు రంగులు ఉన్నాయి, కానీ త్రిభుజం లేదు. దానిపై ఏదో రాసి ఉంది. కాబట్టి దానిలో పాలస్తీనా జెండా యొక్క ఖచ్చితమైన స్పెసిఫికేషన్లు లేవు" అని అతను చెప్పాడు.

మిలాద్-ఉన్-నబీ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని స్మరించుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ప్రవక్త యొక్క బోధనలు, జీవితాన్ని ప్రతిబింబించడం ద్వారా ఈ రోజును జరుపుకుంటారు. అదే రోజున ప్రవక్త మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు గవర్నర్ రఘుబర్ దాస్, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ముహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని మాఝీ తెలిపారు.

Next Story