Breaking: లోక్సభ స్పీకర్ పోరులో.. ఓం బిర్లా విజయం
లోక్సభ స్పీకర్ పోరులో ఓం బిర్లా విజయం సాధించారు. ఆయన రెండోసారి లోక్సభకు సారథ్యం వహిస్తారు.
By అంజి Published on 26 Jun 2024 11:27 AM IST
లోక్సభ స్పీకర్ పోరులో.. ఓం బిర్లా విజయం
లోక్సభ స్పీకర్ పోరులో ఓం బిర్లా విజయం సాధించారు. ఆయన రెండోసారి లోక్సభకు సారథ్యం వహిస్తారు. 18వ లోక్సభ స్పీకర్గా ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా విజయం సాధించారు. విపక్ష కూటమి ప్రతిపాదించిన కె.సురేష్పై ఆయన మూజువాణి ఓటింగ్ ద్వారా గెలుపొందినట్టు ప్రొటెం స్పీకర్ మహతాబ్ భర్తృహరి ప్రకటించారు. అనంతరం.. రాహుల్ గాంధీ బిర్లాకు అభివాదం చేసి ప్రధానితో కరచాలనం చేశారు.కాగా ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కలిసి ఓంబిర్లాను స్పీకర్ కుర్చీ వద్దకు తీసుకెళ్లారు.
అక్కడ మహతాబ్ "ఇది మీ కుర్చీ, దయచేసి ఆసీనులుకాండి" అని ఆయనకు స్వాగతం పలికారు. "మీరు రెండవసారి ఈ కుర్చీకి ఎన్నిక కావడం గౌరవప్రదమైన విషయం" అని ప్రధాన మంత్రి అన్నారు. "నేను మొత్తం సభ తరపున మిమ్మల్ని అభినందిస్తున్నాను. రాబోయే ఐదేళ్ల పాటు మీ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నాను" అని అతను చెప్పాడు.
పార్లమెంటేరియన్గా బిర్లా చేసిన కృషి కొత్త లోక్సభ సభ్యులకు స్ఫూర్తిగా నిలవాలని మోదీ తన ప్రసంగంలో అన్నారు. "మీ మధురమైన చిరునవ్వు మొత్తం సభను సంతోషంగా ఉంచుతుంది" అని ప్రధాని అన్నారు. 2019 - 2024 కాలంలోనూ ఓం బిర్లా స్పీకర్గా వ్యవహరించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లోని కోటా నుండి భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపీగా ఓం బిర్లా గెలిచారు.