పరీక్షల్లో అక్రమాలు.. రైలుకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
NTPC aspirants in Gaya set ablaze train.బీహార్లో రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు(ఆర్ఆర్బీ) పరీక్షలు రాసిన
By తోట వంశీ కుమార్
బీహార్లో రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు(ఆర్ఆర్బీ) పరీక్షలు రాసిన అభ్యర్థులు చేపట్టిన నిరసనలు ఆందోళనకరంగా మారాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వేలాది మంది అభ్యర్థులు గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే.. బుధవారం గయాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గయాలో ఓ రైలుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మంటల్లో బోగీల్లోని సీట్లు, బెర్తులు పూర్తిగా కాలి బూడిదయ్యారు.
సీబీటీ 2 పరీక్ష తేదీని నోటిఫై చేయలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 2019లో విడుదల చేసిన నోటిఫికేషన్కు చెందిన ఫలితాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీటీ 2 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2019లో నిర్వహించిన రైల్వే పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని కోరారు.
Gaya, Bihar | Aspirants vandalized train over alleged irregularities in Railway exam
— ANI (@ANI) January 26, 2022
CBT 2 exam date was not notified; no update on Railway exam which was notified in 2019...Result is still awaited...We demand cancellation of CBT 2 exam & release of exam result: Protester pic.twitter.com/9eyW8JphYa
కాగా.. గయలో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని గయ ఎస్ఎస్పీ ఆదిత్య కుమార్ తెలిపారు. నిరసనకారులు ఒక రైలుకు నిప్పుపెట్టారన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో పలువురిని గుర్తించినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని, విద్యార్థులు ఎవరి ప్రభావానికి లోనుకావద్దని, ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేయవద్దని సూచించారు.
విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఎన్టీపీసీ, లెవల్ 1 పరీక్ష ఫలితాలను రద్దు చేసుకున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. సెలక్షన్ విధానంలో అవకతవకలు జరిగినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇరువర్గాల వాదనలు విని కమిటీ ఒక నివేదికను రైల్వే మంత్రిత్వ శాఖకు సమర్పిస్తుందని పేర్కొంది.