మందుబాబుల‌కు గుడ్‌న్యూస్‌.. తెల్లవారుజామున‌ 3 గంటల వరకు బార్లు

New liquor policy in Delhi.మందుబాబుల‌కు నిజంగా ఇది శుభ‌వార్తనే అని చెప్పాలి. వారికి మంచి కిక్కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 July 2021 6:55 AM GMT
మందుబాబుల‌కు గుడ్‌న్యూస్‌.. తెల్లవారుజామున‌ 3 గంటల వరకు బార్లు

మందుబాబుల‌కు నిజంగా ఇది శుభ‌వార్తనే అని చెప్పాలి. వారికి మంచి కిక్కు ఇచ్చే నిర్ణ‌యాన్ని ఢిల్లీ ప్ర‌భుత్వం తీసుకుంది. నూత‌న ఎక్సైజ్ విధానాన్ని ప్ర‌క‌టించింది. 2021-22 ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఢిల్లీలోని బార్లు తెల్లవారుజామున 3 గంటల వరకు తెరుచుకోనున్నాయి. ఈ నిర్ణ‌యం నిన్న‌టి నుంచే అమ‌ల్లోకి తీసుకుంది. న‌గ‌ర ఆదాయాన్ని పెంచేందుకు, లిక్క‌ర్ మాఫియా ఆగ‌డాల‌ను నిలువ‌రించేందుకు ఢిల్లీ స‌ర్కార్ కొత్త ఎక్సైజ్ పాల‌సీని ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది

ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం రాష్ట్ర రెవెన్యూకి చాలా ముఖ్యమని ఎక్సైజ్ పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. ఇక మందు తాగే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించింది.ఈ కొత్త పాలసీలో ప్రభుత్వ రీటెయిల్ వైన్ షాపులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ప్రైవేట్ షాపులను ప్రమోట్ చేస్తూ పాలసీని తయారు చేసింది. అంతేకాదు వైన్ షాపులు పూర్తి ఎయిర్ కండిషన్ తో, గ్లాస్ డోర్లతో ఉంటాయి. లిక్కర్ కొనుగోలుదారులు షాపుల ఎదుట బారులు తీరకుండా, షాపులోకి వచ్చి వారికి నచ్చిన బ్రాండ్లను కొనుగోలు చేయవచ్చు. బీర్ల కోసం మైక్రో బ్రూవరీలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లోని బార్లు తెల్లవారుజాము 3 గంటల వరకు తెరిచి ఉంటాయి.కాగా.. కొత్త విధానంలో హోం డెలీవ‌రీ గురించి ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.

Next Story