రైత‌న్న‌ల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం.. ఆరు పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర పెంపు

Minimum Support Price Hiked For 6 Crops.కేంద్ర‌ప్ర‌భుత్వం రైతుల‌కు శుభ‌వార్త చెప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Oct 2022 9:37 AM GMT
రైత‌న్న‌ల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం.. ఆరు పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర పెంపు

కేంద్ర‌ప్ర‌భుత్వం రైతుల‌కు శుభ‌వార్త చెప్పింది. రైతుల‌ ఆదాయం పెంచేందుకు, పంట‌ల ఉత్ప‌త్తి పెంపున‌కు ప్రోత్సాహంలో భాగంగా ఆరు పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను పెంచింది. మంగ‌ళ‌వారం న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఆర్థిక వ్య‌వ‌హారాల కేబినేట్ క‌మిటీ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ వివ‌రాల‌ను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు.

2022-23 ర‌బీ సీజ‌న్‌(జూలై-జూన్‌), మార్కెటింగ్ సీజ‌న్ 2023-24 కాలానికి ఆరు పంట‌ల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర పెంచిన‌ట్లు మంత్రి చెప్పారు. గోధుమ‌, ఆవాలు, శ‌న‌గ‌లు, మ‌సూర్‌, బార్లీ మ‌రియు కుసుమ పంట‌ల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను పెంచారు.

మ‌ద్ద‌తు పెంపు త‌రువాత ధ‌ర‌లు ఇలా..

- గోధుమ‌ల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను రూ.100 పెంచ‌గా.. క్వింటాల్ ధ‌ర రూ.2,125కి చేరింది.

- మసూర్ పంట మ‌ద్ద‌తు ధ‌ర రూ.500 పెంచ‌గా.. క్వింటాల్ ధ‌ర రూ.6,000కి పెరిగింది.

- శ‌న‌గ‌ల ధ‌ర రూ.150 పెంచ‌గా.. క్వింటాల్ ధ‌ర రూ.5,335 కి చేరింది.

- బార్లీ ధ‌ర రూ.100 పెంచ‌గా.. క్వింటాల్ ధ‌ర‌ రూ.1,735కి పెరిగింది.

- ఆవాల ధ‌ర రూ.400 పెంచ‌గా.. క్వింటాల్ ధ‌ర రూ.5,450కి చేరింది.

- కుసుమ పంట ధ‌ర రూ.209 పెంచ‌గా.. క్వింటాల్ ధ‌ర రూ.5650కి పెరిగింది.

Next Story