నార్కో టెస్టు చేయండి.. నా సోదరుడి హత్యలో వారి హస్తం కూడా ఉంది
రాజా రఘువంశీ హత్య కేసుకు సంబంధించి రాజా భార్య సోనమ్ రఘువంశీపై మృతుడి సోదరుడు సచిన్ రఘువంశీ పెద్ద ఆరోపణ చేశారు.
By Medi Samrat
రాజా రఘువంశీ హత్య కేసుకు సంబంధించి రాజా భార్య సోనమ్ రఘువంశీపై మృతుడి సోదరుడు సచిన్ రఘువంశీ పెద్ద ఆరోపణ చేశారు. పోలీసులను సోనమ్ పదేపదే తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. మేఘాలయలో హనీమూన్ ట్రిప్లో హత్యకు గురైన రాజా రఘువంశీ అన్నయ్య సచిన్ మాట్లాడుతూ.. హత్య వెనుక ఉన్న మొత్తం నిజాన్ని వెలికితీసేందుకు సమగ్ర దర్యాప్తు కోసం సోనమ్తో పాటు మరో నలుగురు నిందితులను ఇండోర్కు తీసుకురావాలని అన్నారు.
షిల్లాంగ్ కోర్టు సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ కుష్వాహాల పోలీసు కస్టడీని రెండు రోజులు పొడిగించింది. సోనమ్ తన ఎనిమిది రోజుల పోలీసు కస్టడీలో విచారణాధికారులను తప్పుదోవ పట్టించిందని, హత్యకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇవ్వలేదని రాజా సోదరుడు సచిన్ చెప్పారు. సరైన విచారణ కోసం సుదీర్ఘకాలం పోలీసు కస్టడీలో ఉంచాలని అన్నారు.
సచిన్ రఘువంశీ.. సోనమ్ కుటుంబానికి నార్కోఅనాలిసిస్ పరీక్ష చేయాలనే డిమాండ్ను పునరుద్ఘాటించారు. తన సోదరుడి హత్య కుట్రలో ఆమె బంధువులు, స్నేహితులు కూడా పాత్ర పోషించారని ఆరోపించారు. ఇంత పెద్ద కుట్ర పన్నడం అంత సులువు కాదని.. నా తమ్ముడి హత్య వెనుక ఉద్దేశం స్పష్టంగా తెలియాల్సి ఉందని.. ఇందుకోసం సోనమ్తో పాటు ఇతర నిందితులను ఇండోర్కు తీసుకొచ్చి క్షుణ్ణంగా విచారించాలన్నారు.
రాజా తల్లి ఉమా రఘువంశీ తన దివంగత కొడుకును గుర్తు చేసుకుంటూ ఏడ్చింది. సోనమ్ తన కుమారుడిని ఎందుకు చంపింది అని అడిగింది. "అతన్ని అతని స్నేహితులు, అతని సన్నిహితులందరినీ వివరంగా విచారించాలి. నా కొడుకు తప్పు ఏమిటి.. ఆమె ఎందుకు చంపింది? సోనమ్ నోటి నుండి నేరుగా సమాధానం చెప్పే వరకు నేను విశ్రమించను" అని కన్నీళ్లు పెడితూ అడిగింది.
మే 23న రాజా రఘువంశీని ప్రణాళికాబద్ధంగా హత్య చేసిన కేసులో సోనమ్, ఆమె ప్రేమికుడు రాజ్ కుష్వాహా, కుష్వాహా స్నేహితులు విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్పుత్, ఆనంద్ కుర్మీలను పోలీసులు మేఘాలయలో అరెస్టు చేశారు.