కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్.. 17 మంది మృతి

గురువారం జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్ సంభవించి 17 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.

By Medi Samrat
Published on : 14 Aug 2025 4:54 PM IST

కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్.. 17 మంది మృతి

గురువారం జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్ సంభవించి 17 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. హిమాలయ పుణ్యక్షేత్రం మాతా చండికి మచైల్ మాతా యాత్ర వెళ్తున్న మార్గంలో ఈ విపత్తు సంభవించింది, దీంతో యాత్రా మార్గం గందరగోళంగా మారింది.

యాత్ర కోసం విధుల్లో ఉన్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) సిబ్బంది మరణించిన వారిలో ఉన్నారు. మరో ముగ్గురు CISF జవాన్లు గల్లంతయ్యారు. సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి, ప్రాణాలతో బయటపడిన వారిని వెతకడానికి, చిక్కుకున్న వారిని తరలించడానికి పెద్ద ఎత్తున కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. యాత్ర ప్రారంభ స్థానం నుండి యాత్రికులను హడావిడిగా ఖాళీ చేయిస్తున్నట్లు ఘటనా స్థలానికి సంబంధించిన వీడియోలను చూస్తే అర్థం అవుతోంది.

రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి బయలుదేరాయి. నష్ట నివారణ, అవసరమైన రెస్క్యూ ఏర్పాట్లు జరుగుతున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ శర్మ, ప్రభావిత ప్రాంతంలో రెస్క్యూ కార్యకలాపాలు ప్రారంభించినట్లు ధృవీకరించారు.

Next Story