ఆలయ ప్రవేశంపై వివాదం.. దళితులను బహిష్కరించిన గ్రామస్తులు.!

Maharashtra Villagers boycott Dalit community over dispute related to temple entry. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఆలయ ప్రవేశానికి సంబంధించిన వివాదంపై గ్రామస్తులు స్థానిక దళిత

By అంజి  Published on  6 Feb 2022 4:54 AM GMT
ఆలయ ప్రవేశంపై వివాదం.. దళితులను బహిష్కరించిన గ్రామస్తులు.!

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఆలయ ప్రవేశానికి సంబంధించిన వివాదంపై గ్రామస్తులు స్థానిక దళిత సంఘాలను బహిష్కరించాలని నిర్ణయించడంతో ఉద్రిక్తత నెలకొంది. శాంతి కమిటీ సమావేశం అనంతరం వివాదం సద్దుమణిగిందని, ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉందని పోలీసులు శనివారం తెలిపారు. మూడు రోజుల క్రితం నీలంగా తహసీల్‌లోని తాడ్ముగలి గ్రామంలో ఇద్దరు దళిత యువకులు హనుమాన్ ఆలయంలోకి ప్రవేశించి కొబ్బరికాయ పగలగొట్టడంతో వివాదం తలెత్తిందని కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొన్నాయి.

కొంతమంది యువకులు వారి ఆలయంలోకి ప్రవేశించడాన్ని వ్యతిరేకించారు, తరువాత ఇతర కులాల వారు గ్రామంలోని దళిత సమాజాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారని నివేదికలు తెలిపాయి. ఈ విషయమై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్‌కుమార్ కోల్హేను సంప్రదించగా, పోలీసులు ఇరువర్గాలతో సమావేశాలు నిర్వహించారని, వివాదం సద్దుమణిగిందని చెప్పారు. దళితుల ఆలయ ప్రవేశం వివాదానికి కారణమని ఆయన స్పష్టంగా చెప్పలేదు. రెండు గ్రూపుల యువకుల మధ్య మనస్పర్థలు రావడంతో వివాదం తలెత్తిందని, గ్రామస్తులందరితో శనివారం గ్రామ శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి క్షమాపణలు చెప్పామని తెలిపారు.

Next Story